Share News

TDP: విజయవాడ రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలు ఇవే.. బయటపెట్టిన టీడీపీ

ABN , Publish Date - Apr 05 , 2024 | 01:34 PM

Andhrapradesh: విజయవాడలో కరకట్ట ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలను తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సమాచార చట్టం ద్వారా ఇచ్చిన జవాబు ఆధారాలు టీడీపీ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు, మొదటిదశ నిర్మాణం పూర్తి, ఖర్చు చేసిన రూ.164.42కోట్ల వివరాలపై వీడియోను విడుదల చేసింది.

TDP: విజయవాడ రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలు ఇవే.. బయటపెట్టిన టీడీపీ

అమరావతి, ఏప్రిల్ 5: విజయవాడలో కరకట్ట ఆనుకుని నిర్మించిన రిటైనింగ్ వాల్‌పై అసలు వాస్తవాలను తెలుగుదేశం పార్టీ (TDP) బయటపెట్టింది. రిటైనింగ్ వాల్ (Retaining wall) నిర్మాణానికి సంబంధించి సమాచార చట్టం ద్వారా ఇచ్చిన జవాబు ఆధారాలు టీడీపీ.. ప్రజల ముందుకు తీసుకొచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వ (TDP Government) హయాంలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి చేపట్టిన చర్యలు, మొదటిదశ నిర్మాణం పూర్తి, ఖర్చు చేసిన రూ.164.42 కోట్ల వివరాలపై వీడియోను విడుదల చేసింది.

AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!


ఈ సందర్భంగా టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Kommareddy Pattabhiram) మాట్లాడుతూ.. విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి, రిటైనింగ్ వాల్ (Gadde Rammohan) చొరవ, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) కృషితో రిటైనింగ్ వాల్ సాధించింది తెలుగుదేశమే అని చెప్పుకొచ్చారు. ప్రజల్ని దోచుకోవటం తప్ప అభివృద్ధి వైసీపీకి తెలీదన్నారు. ఒక్క ఇంటిని కూడా తొలగించకుండా మొదటి దశ నిర్మాణాన్ని తెలుగుదేశం పూర్తి చేసిందన్నారు. వైసీపీ రెండో దశ నిర్మాణంలో వందలాది ఇళ్లు తొలగించి ఎందరినో నిరాశ్రయుల్ని చేశారన్నారు.


తెలుగుదేశం హయాంలోని మొదలుపెట్టారని సాక్షాత్తు అప్పటి మంత్రులు కొడాలి నాని (Kodali Nani), అనిల్ యాదవ్ (Anil Yadav) చెప్పారన్నారు. దేవినేని అవినాష్ (Devineni Avinash) మాటల్ని నమ్మే పరిస్థితిలో విజయవాడ ప్రజలు లేరని తెలిపారు. రిటైనింగ్ వాల్ ఎవరు ప్రారంభించారు? ఎవరు హాయంలో నిధులు కేటాయించారు? అన్నది ప్రజలందరికీ తెలుసన్నారు. అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని పట్టాభిరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి..

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగాస్త్రాలు..

YS Sharmila: షర్మిల పాదయాత్రకు వైసీపీ నాయకురాలు.. మరికాసేపట్లో కాంగ్రెస్‌లోకి..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 02:05 PM