Share News

AP Elections: వైసీపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కేంద్ర మాజీ మంత్రి..

ABN , Publish Date - Apr 03 , 2024 | 06:11 PM

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు

AP Elections: వైసీపీకి బిగ్ షాక్..  కాంగ్రెస్‌లోకి  కేంద్ర మాజీ మంత్రి..

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2009లో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. తరువాత మారిన రాజకీయ సమీకరణలతో ఆమె వైసీపీలో చేరారు. అయితే టెక్కలి ఎమ్మెల్యే, శ్రీకాకుళం ఎంపీ టికెట్‌ను ఆమె ఆశించారు. చివరికి నామినేటెడ్ పదవుల్లోనూ ఆమెకు అవకాశం కల్పించలేదు. ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టెక్కలి నియోజకవర్గంలో కనీసం గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా సమర్పించారు. నియోజకవర్గంలో ఎవరూ పట్టించుకోవడం లేదని, పార్టీ కోసం కష్టపడే వాళ్లకు గుర్తింపు దక్కడం లేదన్నారు.

Varla Ramaiah: సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోమనడం దుర్మార్గం: వర్ల రామయ్య


జిల్లాలో కీలకనేతగా..

కల్లి కృపారాణి 2012-14 మధ్య కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా మన్మోహన్ సింగ్ కేబినేట్‌లో పనిచేశారు. జిల్లాలోని బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా ఉన్నారు. ఆమె టెక్కలి అసెంబ్లీ లేదా శ్రీకాకుళం ఎంపీ టికెట్ ఆశించారు. ఆమెకు దక్కలేదు. టెక్కలి ఎమ్మెల్యే టికెట్ దువ్వాడ శ్రీనివాస్‌కు ఇవ్వగా.. ఎంపీ టికెట్ పేరాడ తిలక్‌కు ఇచ్చారు. వీరిద్దరూ కృపారాణి సామాజిక వర్గానికి చెందినవాళ్లే.

AP Pension: మరీ ఇంతలానా!.. టీడీపీని బద్నాం చేసేందుకు వృద్ధులను వాడేసుకున్న వైసీపీ

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 06:11 PM