Share News

PM Modi: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో..?

ABN , Publish Date - May 07 , 2024 | 04:48 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది. లోక్ సభ సీట్లు ఎక్కువ గెలవాలని టార్గెట్ విధించుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. రేపు మరోసారి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఎన్టీఏ కూటమి విజయవాడలో బుధవారం రోడ్ షో నిర్వహించనుంది.

PM Modi: విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో..?
pm modi

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారం చేపట్టాలని కూటమి భావిస్తోంది. లోక్ సభ సీట్లు కూడా ఎక్కువ గెలవాలని టార్గెట్ విధించుకుంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించారు. రేపు మరోసారి ఆంధ్రప్రదేశ్ రానున్నారు. ఎన్టీఏ కూటమి విజయవాడలో బుధవారం రోడ్ షో నిర్వహించనుంది. రోడ్ షోకు ప్రధాని మోదీ, (PM Modi) తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరవుతారు.


సాయంత్రం 6 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు రోడ్డు షో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ రంగంలోకి దిగారు. 5 వేల మంది పోలీసులతో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రధాని మోదీ వెళ్లే మార్గం ఇరువైపుల బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో భారీ వాహనాలను ఇప్పటికే పోలీసులు దారి మళ్లించారు.



Read Latest
AP News And Telugu News

Updated Date - May 07 , 2024 | 04:48 PM