Share News

Devineni Uma: కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారు

ABN , Publish Date - May 21 , 2024 | 06:43 PM

కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.

Devineni Uma: కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని.. అనారోగ్యశ్రీగా మార్చారు
Devineni Uma

అమరావతి: కమీషన్లు దండుకుని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత సీఎం జగన్ రెడ్డిదేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆరోపించారు. మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఆరోగ్యశ్రీలో కూడా జగన్ నాటకాలు ఆడారని విమర్శించారు. ప్రభుత్వం బకాయిలు కట్టకపోవడంతోనే ఆరోగ్య శ్రీ సేవలను ప్రైవేట్ ఆస్పత్రులు నిలిపేశాయని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను జగన్ రెడ్డి దారి మళ్లించారని మండిపడ్డారు.


ఆస్పత్రులకు బిల్లులు చెల్లించకుండా అస్మదీయులకు రూ.15వేల కోట్ల వరకు జగన్ రెడ్డి కట్టబెట్టారని దేవినేని ఉమా ఆరోపించారు. ఓట్ల కోసం డాక్టర్లను వాడుకుని గ్రామాల్లో ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ఓటమి భయంతో వైసీపీ నేతలు రాష్ట్రంలో రక్తపాతం సృష్టించారని ఫైర్ అయ్యారు. అరాచకం సృష్టించి బుద్ధి లేకుండా బయటకు వచ్చి వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు న మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చూడబోతోందన్నారు. ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని దేవినేని ఉమా ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ACB Raids: CCS ఏసీపీ ఇంట్లో ఏసీబీ రైడ్స్ కలకలం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు..!

Watch Video: జయ జయహే తెలంగాణ గీతానికి.. కీరవాణి మ్యూజిక్... విడుదల ఎప్పుడంటే..?

DGP Harish kumar: వారికి సీఆర్పీసీ 41 నోటిసులిచ్చాం.. కఠిన చర్యలు తీసుకుంటాం

AP Election 2024: ఏపీ నుంచి ఐప్యాక్‌ ఔట్‌..? ... షాక్‌లో వైసీపీ పెద్దలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 21 , 2024 | 08:47 PM