Share News

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి: ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి

ABN , Publish Date - Jun 03 , 2024 | 08:38 PM

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స‌మ‌న్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నిక‌ల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోమవారం స‌మావేశమయ్యారు.

AP Elections Results2024: ఎన్నికల కౌంటింగ్ రోజు టీడీపీ కార్యకర్తలు స‌ంయమనం పాటించాలి:  ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి
Anam Ramanarayana Reddy

నెల్లూరు: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స‌మ‌న్వయం పాటించాలని మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి (Anam Ramanarayana Reddy) సూచించారు. ఎన్నిక‌ల కౌంటింగ్ ఏజంట్లతో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సోమవారం స‌మావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ నేత‌లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని జాగ్రత్తగా ఉండాలని అన్నారు. నాలుగు ద‌శాబ్దాలుగా చంద్రబాబు నేర్పించిన క్రమశిక్షణనే అనుస‌రిద్దామని తెలిపారు.


వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స‌జ్జల రామ‌కృష్ణా రెడ్డి కౌంటింగ్ ప్రక్రియపై మాట్లాడిన మాట‌లు రాష్ట్ర ప్రజలు, అధికార‌లు శ్రద్ధగా గ‌మ‌నించారన్నారు. గొడ‌వ‌లు, త‌గాదాలు సృష్టించి కౌంటింగ్ ప్రక్రియ‌ని ఆల‌స్యం చేసేందుకు స‌జ్జల చూస్తున్నారని అన్నారు. స‌జ్జల కుటిల ప్రయత్నాల‌ను తిప్పికొట్టే విధంగా ఏజంట్లు కూట‌మి అభ్యర్థుల విజ‌యానికి కృషి చేయాలని చెప్పారు.టీడీపీ కార్యకర్తలు అనుస‌రించే విధానం, యావ‌త్ భార‌త దేశానికి ఆద‌ర్శం కావాలని తెలిపారు. రేపు కూట‌మి దేశవ్యాప్తంగా అధికారాన్ని అందుకోనుందని ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Election Results 2024: సీఎం.. సీఎం అంటూ నినాదాలు.. రేపు సంబరాలు చేసుకుందామన్న సీబీఎన్!

Delhi Liquor Scam::కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసిన ఈడీ.. సంచలన విషయాలు వెలుగులోకి..!

CM Revanth: తెలంగాణ సచివాలయంలో వాస్తు మార్పులు.. ఎంట్రీ మారింది!

Delhi Liquor Scam:: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు

For More AP News and Telugu News..

Updated Date - Jun 03 , 2024 | 08:38 PM