Share News

AP News: తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు...

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:59 PM

Andhrapradesh: తిరుపతిలో ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

AP News: తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు...
Elephants Attack

తిరుపతి, ఏప్రిల్ 6: తిరుపతిలో (Tirupati) ఏనుగుల బీభత్సం అంతా ఇంతా కాదు. గజరాజుల (Elephants) విజృంభన రైతులకు ఆవేదనను మిగిల్చింది. గత కొద్ది రోజులుగా ఏనుగుల హల్‌చల్‌తో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. రేణిగుంట మండలం చైతన్యపురం గ్రామంలో ఏకంగా 15 ఏనుగుల సంచారంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల బీభత్సంతో పంట పొలాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో మామిడి పంటపై ఆధారపడ్డ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం


దాదాపు 80 ఎకరాల్లో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. గతంలోనూ ఇలాంటి దాడులు జరిగాయని రైతులు వాపోతున్నారు. గజరాజుల విహారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం మాత్రం శూన్యం అని మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుంచి మామిడి చెట్లను రక్షించుకోవడానికి ప్రాణాలకు తెగించి తమ వద్దనున్న బాణాసంచాను పేల్చి రైతులు ఏనుగులను తరిమే ప్రయత్నం చేశారు. అయినా ఎలాంటి లాభం లేకుండా పోయిందని అన్నదాతలు చెబుతున్నారు. పూర్తిగా నష్టపోయిన తమను ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Bird Flu: ముంచుకొస్తున్న ‘బర్డ్‌ఫ్లూ’ ముప్పు.. కొవిడ్ కన్నా 100 రెట్లు ప్రమాదకరం

SRH vs CSK: ధోని క్రీజులోకి రాకుండా కమిన్స్ వ్యూహం పన్నాడా..? అందుకే రివ్యూకు వెళ్లలేదా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 04:01 PM