Home » Elephant
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం టీఎస్ అగ్రహారంలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. గ్రామంలోని పంట పొలాల్లోకి ప్రవేశించిన ఏనుగులు వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి.
ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అవి అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
ఏనుగుల సంరక్షణకు కట్టుబడి ఉన్నామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఏనుగుల ఆవాసాలు, కారిడార్ల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంపు నుంచి రెండు కుంకీ ఏనుగులను పార్వతీపురం మన్యం జిల్లాకు అటవీశాఖ అధికారులు తరలిస్తున్నారు. మన్యం జిల్లాకు వెళ్లే మార్గంలో మంగళగిరిలోని డిప్యూటీ సీఎం కార్యాలయం వద్దకు కుంకీ ఏనుగులు చేరుకున్నాయి.
మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయం వద్ద జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు.
మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్ అధికారి జయశంకర్, పీకేఎం ఉడా చైర్మన్ డా.సురే్షబాబులు తెలిపారు.
తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. కూరపర్తివారిపల్లి, నెరబైలు, మడిచెరువు అటవీ సమీపంలోని మామిడి తోటలు, టెంకాయ, వరి పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి.
కర్ణాటకలోని దుబారే ఏనుగుల శిబిరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రెండు ఏనుగుల మధ్య జరిగిన పోరులో ఓ మహిళ పర్యాటకురాలు ప్రాణాలు కోల్పోయారు.
కేరళలోని సంప్రదాయ ఆలయ ఉత్సవాలు ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయాయి. రాష్ట్రంలో వేసవి ఉత్సవాల సందడి నెలకొన్న వేళ ఈ రోజు(శనివారం) చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనలు తీవ్ర ఆందోళనల్ని కలిగిస్తున్నాయి.
రామకుప్పం మండలంలోని నారాయణపురం తండా సమీప పొలాల్లో గురువారం రాత్రి ఒంటరి ఏనుగు సంచారం స్థానికులకు ఆందోళన కలిగించింది.