Share News

TDP-Janasena: ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అవేంటంటే..

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:47 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల మధ్య భేటీ ముగిసింది. వీరిద్దరి మధ్య ముఖ్యంగా మూడు అంశాలపై గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ఎన్డీఏలో టీడీపీ చేరిక, బీజేపీతో సీట్ల సర్దుబాటు, ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

TDP-Janasena: ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ.. అవేంటంటే..

అమరావతి: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)ల మధ్య భేటీ ముగిసింది. వీరిద్దరి మధ్య ముఖ్యంగా మూడు అంశాలపై గంటన్నర పాటు చర్చలు జరిగాయి. ఎన్డీఏ (NDA)లో చేరిక, బీజేపీ (BJP)తో సీట్ల సర్దుబాటు, ఢిల్లీ పర్యటనపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

కారెక్కిన ఏనుగు!

రాష్ట్రంలో జనసేనకు ఇచ్చిన సీట్లు, రెండు పార్టీల మధ్య సమన్వయం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయని సమాచారం. సమన్వయం కోసం ఒక కమిటీ వేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీతో సీట్ల సర్దుబాటుపై చర్చల తరువాత మొత్తం సీట్లను ఒకేసారి ప్రకటించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మూడవ ఉమ్మడి సభ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై కూడా సమాలోచనలు జరుగుతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో వెంటనే సిద్ధం చేసి విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

Chintamohan: ఏపీలో జగన్ గాలి తగ్గింది.. కాంగ్రెస్ గెలుస్తుంది కానీ..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 06 , 2024 | 12:56 PM