Share News

Kesineni Nani: టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది..

ABN , Publish Date - Mar 16 , 2024 | 11:14 AM

ఎంపీ కేశినేని నానిపై బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం మీ వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పని చేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు.

Kesineni Nani: టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర కేశినేని నానిది..

విజయవాడ: ఎంపీ కేశినేని నాని (Kesineni Nani)పై బుద్దా వెంకన్న (Budha Venkanna) ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం మీ వెనుక పది మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. కార్యకర్తలు పార్టీ కోసం, టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) కోసం పని చేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు. తన సోదరుడు మీద కూడా ఎలాగూ గెలవలేడని బుద్దా వెంకన్న అన్నారు.

CM Revanth: సీఎంగా తొలిసారి ఏపీకి రేవంత్... కామెంట్లపై సర్వత్రా ఆసక్తి

‘‘లక్ష ఓట్లతో టీడీపీ విజయం ఖాయం. కేశినేని నాని మహా భారతంలో బృహన్నల లాంటోడు. నీతో భీష్ముడు లాంటి మా వాళ్లు యుద్ధం చేయరు. మూడు లక్షల ఓట్లతో ఓడిస్తావా..? నీకు పిచ్చి పట్టింది. ముందు ముందు నీకు మొసళ్ల పండుగ ఉంది. కేశినేని నాని పిచ్చి వాగుడు మానుకుంటే మంచిది. టీడీపీలో ఉన్న సమయంలో ఎలా ఉన్నావు... ఇప్పుడు నీ మొహం ఎలా ఉందో అద్దంలో చూసుకో. టిక్కెట్ ఇప్పిస్తానని‌ చెప్పి డబ్బులు వసూళ్లు చేసిన చరిత్ర నీది. నీకు ఓటమి ఖాయం... నీ భవిష్యత్ శూన్యం. లక్ష ఓట్ల తేడా తో నిన్ను చిత్తు చేస్తాం’’ అంటూ బుద్దా వెంకన్న సవాల్ చేశారు.

పొత్తులు, పోరాటాలపై..

‘‘పొత్తులు అన్న తరువాత కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కార్యకర్తలు చంద్రబాబు కోసం పని చేస్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచే వ్యక్తుల్లో బుద్దా వెంకన్న ముందు ఉన్నారు. అన్ని సర్వేల్లో విజయం ఖాయం అని వచ్చింది. పార్టీ కోసం, చంద్రబాబు కోసం అనేక‌ పోరాటాలు చేశాం. సీటు ఇవ్వాలని కోరాను... సాధ్యం కాదని అధినేత చెప్పారు. అయినా చంద్రబాబు మీద గౌరవంతో శిరసా వహించా. టీడీపీ, జనసేన (Janasena), బీజేపీ (BJP) కూటమి కోసం నేను చిత్తశుద్ధితో పని చేస్తా. ఇలా చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కోసం నాయకులు పని చేశారు. మూడు పార్టీలు కలయిక వల్ల కొన్ని త్యాగాలు తప్పవు. ఆవేదన ఉన్నా అర్ధం చేసుకుని పార్టీ కోసం పని చేయాలి. నేడు మనం‌ నాయకులుగా ఎదిగామంటే చంద్రబాబు, కార్యకర్తలే కారణం. అందరం క‌లిసి రాక్షస పాలనను తరిమి కొట్టాలి’’ అని బుద్దా వెంకన్న తెలిపారు.

AP News: అమెరికాలో గుంటూరు విద్యార్థి దారుణ హత్య

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2024 | 11:14 AM