Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

CM Ramesh: మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన

ABN , Publish Date - Mar 02 , 2024 | 05:38 PM

అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై చర్చ జరిగిందన్నారు.

CM Ramesh: మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన

విజయవాడ: అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) పొత్తులపై మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన వస్తుందని బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలపై చర్చ జరిగిందన్నారు. బీజేపీ జాతీయ నేత శివప్రకాష్‌.. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. పొత్తులతో వెళితే ఎలా ఉంటుంది, పొత్తు లేకుండా వెళ్తే ఎలా ఉంటుందన్న అంశంపై తమ అభిప్రాయాలను తెలియజేసినట్లు చెప్పారు. పొత్తులు ఖారారైతే కేంద్రమే ఈ విషయంపై స్పష్టత ఇస్తుందన్నారు. ఒకవేళ పొత్తులు లేకపోతే తమ వరకు తాము పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. ఈరోజు, రేపు కూడా అభిప్రాయాల సేకరణ చేస్తారని, మూడు రోజుల్లో ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వస్తుందని సీఎం రమేష్ పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2024 | 05:38 PM