Vijayashanthi: కవితకు ఈడీ నోటీసులపై రాములమ్మ ట్వీట్.. పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

ABN , First Publish Date - 2023-09-15T09:34:21+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు.

Vijayashanthi: కవితకు ఈడీ నోటీసులపై రాములమ్మ ట్వీట్.. పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liqour Scam) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ నేత విజయశాంతి (BJP Leader Vijayashanthi) ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను తాము కోరుకోవడం లేదని తెలిపారు. రాజకీయంగా ఆ.. అవసరం కూడా బీజేపీకి లేదని స్పష్టం చేశారు. సాటి ఆడబిడ్డకు ఎలాంటి కష్టం రాకూడదని సానుభూతి వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కూడా రాములమ్మ తెలిపారు. కవిత అరెస్ట్ కానంత మాత్రానా.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాదన్నారు. అయితే బీఆర్‌ఎస్‌పై ఆ పార్టీ అధినేతపై విమర్శలు గుప్పించే విజయశాంతి ఒక్కసారిగా కవితకు ఈడీ నోటీసులపై కూల్‌గా రియాక్షన్ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో తీవ్రమైన చర్చకు దారి తీసింది.


విజయశాంతి ట్వీట్ ఇదే..

‘‘ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు... ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత అరెస్ట్ కానట్లు అయితే... బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న భావంతో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆర్‌ఎస్‌కు ఉందేమో గానీ... జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్‌ఎస్ ప్రోద్భలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నది. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు... ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది’’ అంటూ రాములమ్మ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-09-15T09:40:03+05:30 IST