Share News

KTR : కాంగ్రెస్ నేతల గుండాయిజంకు భయపడవద్దు

ABN , First Publish Date - 2023-11-23T22:33:51+05:30 IST

మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు.

KTR : కాంగ్రెస్ నేతల గుండాయిజంకు భయపడవద్దు

హైదరాబాద్: మేము ఎవ్వరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదు తెలంగాణ మా టీమ్ అని బీఆర్ఎస్ వర్కిగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) వ్యాఖ్యానించారు. గురువారం నాడు మల్కాజ్‌గిరిలో ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడుతూ...‘‘తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ నేతల గుండాయిజం, రౌడీయిజంకు భయపడకండి ప్రభుత్వం మనది. మల్కాజ్‌గిరిలో జరిగిన అభివృద్ధి మొత్తం కేసీఆర్ చొరువతోనే జరిగింది. ఏ అల్లాటప్ప నాయకులతో జరగలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. సౌభాగ్య లక్ష్మి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 3 వేలు, రూ. 400కే గ్యాస్ సిలిండర్, తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం, కోటి కుటుంబాలకు 5 లక్షల కేసీఆర్ బీమా సదుపాయం వంటి పథకాలతో పాటు అనేక స్కీమ్‌లు మా ఆలోచనలో ఉన్నాయి. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపించి అసెంబ్లీకి పంపిండి. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-23T22:33:56+05:30 IST