Share News

Digvijaya Singh : రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

ABN , First Publish Date - 2023-11-26T16:58:05+05:30 IST

రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు.

Digvijaya Singh  :  రాముడితో కొంతమంది రాజకీయం చేస్తున్నారు

హైదరాబాద్: రాముడు అందరికీ దేవుడే.. కానీ కొంతమంది రాముడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ( Digvijaya Singh ) అన్నారు. ఆదివారం నాడు గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘హైదరాబాద్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతగానో కృషి చేసింది. కాంగ్రెస్ పార్టీ అవుటర్ రింగ్ రోడ్డుకి రూపకల్పన చేసింది. సోనియాగాందీ వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమయింది. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ఇచ్చిన వాగ్దానాలు తప్పకుండా అమలు చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు సామాన్య రైతులకు కాకుండా భూస్వాములకు ఉపయోగపడుతోంది. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చారు. కాంగ్రెస్ మత రాజకీయాలు చేయదు. మతాన్ని వాడుకొని రాజకీయాలు చేసే వాళ్లకి మేం వ్యతిరేకం’’ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-26T17:11:17+05:30 IST