Share News

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

ABN , First Publish Date - 2023-11-25T10:45:24+05:30 IST

Telangana Elections: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు (శనివారం) కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు.

Congress Campaign: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార జోరు.. నేడు తెలంగాణకు ముఖ్యనేతలు

హైదరాబాద్: తెలంగాణలో (Telangana State) అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తన ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. అందులో భాగంగానే ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ నేతలు (Congress National Leaders) పాల్గొంటూ పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు (శనివారం) కాంగ్రెస్ ముఖ్యనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ (Rahula Gandhi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh), డీకే శివకుమార్ (DK Shivakumar) ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

బోధన్, ఆదిలాబాద్, వేములవాడలలో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. అలాగే ప్రియాంకా గాంధీ పాలేరు, ఖమ్మం, వైరా ,మధిర నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు జుక్కల్, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల్లో డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారం చేస్తారు. సనత్ నగర్, కల్వకుర్తి ఎన్నికల ప్రచార సభలలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పాల్గొననున్నారు. ఈరోజు సాయంత్రం దిగ్విజయ్ సింగ్‌ హైదరాబాద్‌కు రానున్నారు. వార్‌రూమ్ నుంచి కాంగ్రెస్ ఎన్నికలు, ప్రచారం తదితర విషయాలను దిగ్విజయ్ సింగ్ పర్యవేక్షించనున్నారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-25T10:50:11+05:30 IST