IND vs AFG Final: గోల్డ్ పోరుకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్కోర్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-10-07T13:54:20+05:30 IST

చైనా వేదికగా జరుగుతున్న మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆప్ఘనిస్థాన్ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.

IND vs AFG Final: గోల్డ్ పోరుకు వర్షం ఆటంకం.. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి స్కోర్ ఎంతంటే..?

హాంగ్జౌ: చైనా వేదికగా జరుగుతున్న మెన్స్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ఆటంకిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆప్ఘనిస్థాన్ జట్టు 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజులో షాహిదుల్లా కమల్(49), గుల్బాదిన్ నాయబ్‌ (27) ఉన్నారు. గోల్డ్ పోరులో భారత్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ ప్రారంభించిన ఆప్ఘనిస్థాన్ జట్టు 12 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయింది. భారత పేసర్లు శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్ ధాటికి ఆప్ఘనిస్థాన్ ఓపెనర్లు జుబైద్ అక్బరీ(5), మహ్మద్ షాజాద్(4) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. ఆ వెంటనే నూర్ అలీ జద్రాన్(1) రనౌట్ అయ్యాడు. ఇలాంటి సమయంలో షాహిదుల్లా కమల్, అఫ్సర్ జజాయ్ ఆప్ఘనిస్థాన్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 37 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని 10వ ఓవర్లో స్పిన్నర్ రవి బిష్ణోయ్ విడదీశాడు. అఫ్సర్ జజాయ్(15)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే కరీం జనత్(1)ను మరో స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 52 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన ఆప్ఘనిస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఆప్ఘనిస్థాన్‌ను కెప్టెన్ గుల్బాదిన్ నాయబ్‌తో కలిసి షాహిదుల్లా కమల్ ఆదుకున్నాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అజేయంగా హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అయితే ఆప్ఘనిస్థాన్ స్కోర్ 18.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 112గా ఉన్న సమయంలో వర్షం వచ్చింది. దీంతో ప్రస్తుతం మ్యాచ్ నిలిచిపోయింది. క్రీజులో షాహిదుల్లా కమల్(49), గుల్బాదిన్ నాయబ్‌ (27) ఉన్నారు.

Updated Date - 2023-10-07T14:02:52+05:30 IST