IND vs AUS: జార్వోకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. పాపం ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..

ABN , First Publish Date - 2023-10-09T12:02:28+05:30 IST

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్‌లోని మరే మ్యాచ్‌కు హాజరుకాకుండా నిషేధం విధించింది.

IND vs AUS: జార్వోకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. పాపం ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు..

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించి ఆటంకం కల్గించిన జార్వోకి ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అతను ఈ ప్రపంచకప్‌లోని మరే మ్యాచ్‌కు హాజరుకాకుండా నిషేధం విధించింది. "జార్వో వరల్డ్‌కప్‌లోని మిగతా మ్యాచ్‌లకు హాజరుకాకుండా నిషేధించబడ్డాడు. ఇది అమలు చేయడం భారత అధికారుల చేతుల్లో ఉంది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023లో పాల్గొనే ప్రతి ఒక్కరి భద్రత మా ప్రాధాన్యత. ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి మేము చెన్నై గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడుతాం. ఇలాంటివి మళ్లీ జరగకుండా నిరోధించడానికి ఏదైనా అదనపు భద్రతా చర్యలు అవసరమైతే పరిశీలిస్తాము." అని ఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే అతను స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించాడు? సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి ఎలా వచ్చాడనేది ప్రశ్నగా మారింది. దీంతో వరల్డ్‌కప్‌లోని మిగతా మ్యాచ్‌లను చూడడానికి మైదానంలోకి వెళ్లడానికి జార్వోకు అనుమతి లేదు. తన చిల్లర చేష్టలతో పదే పదే మ్యాచ్‌కు ఆటంకం కల్గించిన జార్వో ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండకపోవచ్చని అభిమానులు అంటున్నారు.


అసలు ఏం జరిగిదంటే.. ప్రపంచకప్‌లో భాగంగా చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ జరుగుతుండగా 69 నంబర్ గల టీమిండియా జెర్సీ ధరించిన జార్వో భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి వచ్చాడు. జెర్సీపై అతని పేరు కూడా ఉంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మ్యాచ్ సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటికి పంపించింది. ఒకసారి బయటికి పంపినప్పటికీ జార్వో మరోసారి మైదానంలోకి ప్రవేశించడం గందరగోళానికి దారి తీసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మొదట మ్యాచ్‌ ఇంకాసేపట్లో ప్రారంభం అవుతుందనగా జార్వో మైదానంలోకి ప్రవేశించాడు. అప్పుడు జార్వోను బయటికి పంపించేందుకు టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీతోసహా గ్రౌండ్ సిబ్బంది ప్రయత్నించడం ఒక ఫోటోలో కనిపించింది. మరో ఫోటోలో మ్యాచ్ మధ్యలో మైదానంలోకి ప్రవేశించిన జార్వోకు టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బయటికి వెళ్లే మార్గం చూపిండం చూడొచ్చు. చివరకు చెన్నై మైదాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు జార్వోను అరెస్ట్ చేశారు.

కాగా జార్వో మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి ప్రవేశించడం ఇది కొత్తేం కాదు. మొదటిసారిగా 28 ఆగష్టు 2021న భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత లార్డ్స్, హెడింగ్లీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లోనూ అతను ఇదే విధంగా ప్రవర్తించాడు. టీమిండియా రెండో వికెట్ పడగానే విరాట్ కోహ్లీ రాక కోసం అందరూ టీమిండియా డగౌట్ కోసం చూస్తుంటే అతని కంటే ముందుగానే జార్వో మైదానంలోకి ప్రవేశించాడు. టీమిండియా జెర్సీ ధరించి చేతిలో బ్యాట్, తలకు హెల్మెట్‌తో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మరోసారి టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడానికి మైదానంలోకి వెళ్తుండగా వారితో కలిసి జార్వో కూడా వెళ్లాడు, మరోసారి అయితే టీమిండియా ఫీల్డింగ్ చేస్తుండగా ఆకస్మాత్తుగా మైదానంలోకి ప్రవేశించి చేతిలో బంతి లేకపోయినప్పటికీ బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ బ్యాటర్ బెయిర్‌స్టోను ఢీకొట్టబోయాడు. దీంతో తన ఏకాగ్రత దెబ్బ తిందని మ్యాచ్ అనంతరం బెయిర్ స్టో చెప్పాడు. జార్వో మైదానంలోకి వచ్చిన ప్రతిసారి బయటికి తీసుకెళ్లిన గ్రౌండ్ సిబ్బంది అతనికి ఎంత చెప్పినా తీరు మార్చుకోలేదు. హెచ్చరించిన కూడా వినలేదు. దీంతో అతడిని ఇంగ్లండ్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

Updated Date - 2023-10-09T12:02:28+05:30 IST