Share News

Virat Kohli: కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుష్క శర్మ.. అరుదైన రికార్డు గురించి ప్రస్తావన..

ABN , First Publish Date - 2023-11-05T14:58:43+05:30 IST

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు ప్రముఖులతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మ కూడా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

Virat Kohli: కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన అనుష్క శర్మ.. అరుదైన రికార్డు గురించి ప్రస్తావన..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు ప్రముఖులతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలో అనుష్క శర్మ కూడా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసింది. "కోహ్లీ నా జీవితంలోని ప్రతి పాత్రలో అక్షరాలా అసాధారణంగా ఉంటాడు! కానీ ఏదో ఒక విధంగా నేను కూడా అతని అద్భుతమైన ప్రయాణంలో కొనసాగుతున్నాను. ఈ జీవితంలో నేను నిన్ను అంతకు మించి ప్రేమిస్తున్నాను. అది ఏ రూపంలోనైనా కావచ్చు"అని రాసుకొచ్చింది. అలాగే అనుష్క శర్మ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను కూడా అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డుకు సంబంధించినది కావడం గమనార్హం. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన ఏకైక బౌలర్ విరాట్ కోహ్లీ అని ఆ పోస్టులో ఉంది. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ వార్తా సంస్థ రాసిన వార్తను పోస్ట్ చేసింది. 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ తొలి సారి బౌలింగ్ చేశాడు. వేసిన మొదటి బంతి వైడ్ వెళ్లింది. కానీ ఇంగ్లండ్ బ్యాటర్ పీటర్సన్ ముందుకెళ్లి ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ ధోని బంతి అందుకుని స్టంపింగ్ చేశాడు. దీంతో అలా కోహ్లీ ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన బౌలర్‌గా అరుదైన రికార్డును సాధించాడు.


కాగా కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2017లో వివాహమైంది. వీరికి 2021 జనవరిలో ఓ కూతురు పుట్టింది. ఆ కూతురి పేరు వామిక. అయితే గత నెలలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో గౌహతి నుంచి ముంబైకి వెళ్లాడు. దీంతో కోహ్లీ, అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక ప్రస్తుత ప్రపంచకప్‌‌లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు బాదేశాడు. భారత జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికే 48 సెంచరీలు బాదిన కోహ్లీ.. మరొక సెంచరీ బాదితే 49వ సెంచరీ అవుతుంది. దీంతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.

Updated Date - 2023-11-05T15:07:02+05:30 IST