వర్షంలో తడుస్తూ స్కూలు నుంచి ఇంటికెళ్తున్న 11 ఏళ్ల బాలిక.. ఊళ్లో దించుతాననగానే ట్యాక్సీ ఎక్కడమే ఆమె పొరపాటయింది.. మర్నాడే..

ABN , First Publish Date - 2023-04-19T20:44:16+05:30 IST

వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది మహిళలు నిత్యం వేధింపులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే.. ఏదో రకంగా తమ దారికి తెచ్చుకోవాలని చూడడం, వీలు కానప్పుడు దారుణాలకు తెగబడడం సర్వసాధారణమైంది. ఇటీవల..

వర్షంలో తడుస్తూ స్కూలు నుంచి ఇంటికెళ్తున్న 11 ఏళ్ల బాలిక.. ఊళ్లో దించుతాననగానే ట్యాక్సీ ఎక్కడమే ఆమె పొరపాటయింది.. మర్నాడే..
ప్రతీకాత్మక చిత్రం

వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది మహిళలు నిత్యం వేధింపులకు గురవడం చూస్తూనే ఉన్నాం. ఒంటరిగా ఉన్న మహిళలను చూస్తే.. ఏదో రకంగా తమ దారికి తెచ్చుకోవాలని చూడడం, వీలు కానప్పుడు దారుణాలకు తెగబడడం సర్వసాధారణమైంది. ఇటీవల సిక్కింలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. 11ఏళ్ల బాలిక స్కూలు నుంచి వర్షంలో తడుస్తూ ఇంటికి బయటలుదేరింది. దారి మధ్యలో ఎదురుపడిన ఓ ట్యాక్సీ డ్రైవర్.. ఊళ్లో దించుతానని అనగానే బాలిక కారు ఎక్కింది. ఆ మరుసటి రోజు జరిగిన ఘటన గురించి తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

సిక్కిం (Sikkim) రాజధాని గ్యాంగ్‌టక్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 11ఏళ్ల బాలిక (girl) ఇదే ప్రాంతంలోని స్కూల్లో చదువుతోంది. రోజూ లాగానే ఏప్రిల్ 14న కూడా స్కూలుకు వెళ్లింది. అయితే ఆ రోజు స్కూలు అయిపోయే సమయానికి పెద్ద వర్షం మొదలైంది. పిల్లలంతా ఎవరి సౌకర్యం కొద్దీ వారు ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఎలాగోలా ఇంటికి చేరుకోవాలన్ని ఉద్దేశంతో బాలిక కూడా ఇంటికి బయలుదేరింది. వర్షంలో తడుస్తూనే నడుచుకుంటూ వెళ్తుండగా.. దారి మధ్యలో ప్రీతమ్ అనే ట్యాక్సీ డ్రైవర్ (Taxi driver) గమనించాడు. ‘‘కారు ఎక్కు.. మీ ఇంటి వద్ద దింపుతా’’.. అని అనడంతో బాలిక కూడా వెంటనే అతడి కారు ఎక్కింది. అయితే బాలికను ఇంటి వద్ద దింపకుండా నేరుగా నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు.

Viral News: వీడి తెలివి తెల్లారిపోనూ.. టాయ్‌లెట్ వస్తోందని పోలీసులకు చెప్పి బాత్రూంకు వెళ్లాడు.. కాసేపటికే అరుపులు కేకలు.. వెళ్లి చూస్తే..

అనంతరం ఆమె నోరు మూసి అత్యాచారానికి (Misbehavior with a girl) పాల్పడ్డాడు. విషయం బయట చెబుతుందనే ఉద్దేశంతో గొంతు నులిమి హత్య చేశాడు. మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు బాలిక మృతదేహాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చుట్టు పక్కల సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడు బీహార్‌కు చెందిన వాడని, గత పదేళ్లుగా స్థానికంగా ట్యాక్సీ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. బాలిక మృతితో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Crime News: మరీ ఇంత నీచమా..? పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి మరీ అత్యాచారం చేశారు..!

Updated Date - 2023-04-19T20:44:16+05:30 IST