Home » Sikkim
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదివారంనాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్టు తెలిపింది.
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ లేని రాష్ట్రంగా ఉన్న సిక్కిం.. ఇక ముందు రైలు సర్వీసులను ప్రారంభించనుంది. సిక్కింలో తొలి రైల్వే స్టేషన్ రంగ్పో ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం శంకుస్థాపన చేయనున్నారు.
సిక్కిం నుంచి రాజ్యసభ అభ్యర్థి పేరును బీజేపీ ఖరారు చేసింది. డోర్జీ త్రేసింగ్ లేప్చాను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి 3, సిక్కిం నుంచి ఒక రాజ్యసభ స్థానానికి జనవరి 19న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.
నకిలీ పాస్ పోర్టులు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సీబీఐ(CBI) అధికారులు. పలు ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ దందా ఏళ్లుగా నడుస్తోందని తెలుస్తోంది. విశ్వసనీయంగా తెలిసి సమాచారంతో దాడులు జరిపిన సీబీఐ చాలా మందిపై కేసులు నమోదు చేసింది.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్(Lachen, Lachung) పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు(Tourists) చిక్కుకుపోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల సంభవించిన ఆకస్మిక వరదల్లో(Floods) తప్పిపోయిన వారి మృతదేహాలు పదులు సంఖ్యలో బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 55 మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలతో సిక్కిం రాష్ట్రం అతలాకుతలం అవుతుంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు ప్రాంతంలో కురిసిన కుంభవృష్టి కారణంగా చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో తీస్తా నదికి భారీ వరద పోటెత్తింది. నది ఉప్పొంగడంతో వరదలు సంభవించాయి.
సిక్కింలో భారీ వరదలు సృష్టించిన బీభత్సంలో చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకుపోయింది. దీంతో ముంపు ప్రాంతాల్లో తీరని ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగాయి. అయితే ఆ డ్యాం నాసిరకంగా కట్టడం వల్లే కొట్టుకుపోయిందని ఆ రాష్ట్ర సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ తెలిపారు.
ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సుపై బుధవారం క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరద విపత్తలో 22 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఆకస్మిక వరదల్లో నలుగురు సైనికులతో సహా 19 మంది మృతి చెందినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. 100 మందికి పైగా తప్పిపోయారు. సహాయక చర్యలు చేపట్టిన భారత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు తీస్తా నదీ పరీవాహక ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ ని కొనసాగిస్తున్నాయి. అయితే వాతావరణం అనుకూలించపోవడంతో పరిస్థితి ప్రతికూలంగా మారింది.
సిక్కింలో క్లౌడ్ బరస్ట్(Cloud Burst) వల్ల భారీ విధ్వంసం సంభవించింది. సౌత్ లొనాక్(South Lonak) సరస్సుకి వరదలు పోటెత్తడంతో తీస్తా నది నీటి మట్టం పెరిగింది. దీంతో తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. అయితే భారీ వర్షాలు కురిస్తే లోనాక్ సరస్సు ప్రమాదకరంగా మారుతుందని గతంలోనే ఓ నివేదిక వెల్లడించింది.