Crime: మా ఎదురింట్లోంచి మంటలు వస్తున్నాయంటూ ఓ వ్యక్తి ఫోన్.. పోలీసులు వెళ్లేసరికే కాలిపోయిన మృతదేహం.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-08-23T21:50:14+05:30 IST

ఓ ఇంట్లోని గది నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఎదురించి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిచంగా.. అక్కడ ఓ వృద్ధురాలి మృతదేహం బయటపడింది. అయితే ఆమె మరణం వెనుక ఆ ఇంటి కోడలి ప్లాన్ ఉందనే విషయం...

Crime: మా ఎదురింట్లోంచి మంటలు వస్తున్నాయంటూ ఓ వ్యక్తి ఫోన్.. పోలీసులు వెళ్లేసరికే కాలిపోయిన మృతదేహం.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

ఓ ఇంట్లోని గది నుంచి ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో గమనించిన ఎదురించి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలిచంగా.. అక్కడ ఓ వృద్ధురాలి మృతదేహం బయటపడింది. అయితే ఆమె మరణం వెనుక ఆ ఇంటి కోడలి ప్లాన్ ఉందనే విషయం అందరికీ ఆలస్యంగా తెలిసింది. ఇంతకీ ఆమె ఎవరు, ఎందుకు ఇలాంటి పని చేసింది, చివరకు ఏం జరిగింది.. తదితర పూర్తి వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లా మోహన్ నగర్‌కు చెందిన భూపేంద్ర యాదవ్ అనే వ్యక్తికి.. భార్య సుప్రియ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలావుండగా, స్థానిక గండాయి అనే గ్రామంలో ఉమేష్ అనే వ్యక్తి చిన్న క్లినిక్ నడుపుతుంటాడు. కొన్ని నెలల కిందట సుప్రియకు ఉమేష్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికే అత్తమామలు, భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సుప్రియకు.. ఉమేష్ మాటలు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చాయి. దీంతో ఆమె పదే పదే అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. భర్తలేని సమయంలో ప్రియుడితో కలుస్తూ ఉండేది. అయితే జీవితాంతం కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అయితే సమాజం దృష్టిలో ఇది సాధ్యం కాదు కాబట్టి.. చివరకూ ఇద్దరూ కలిసి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

Woman Constable: లింగమార్పిడి చేయించుకోవాలనుకున్న మహిళా కానిస్టేబుల్‌కు వింత కష్టం.. న్యాయం కోసం హైకోర్టుకెళ్తే..!

భర్త, అత్తమామలు, సమజం దృష్టిలో సుప్రియ చనిపోయినట్లు నమ్మిస్తే.. ఇద్దరూ కలిసి దూరంగా వెళ్లిపోయి బతకొచ్చని ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఉమేష్ కన్ను.. తన క్లినిక్‌లో కొన్నాళ్లుగా చికిత్స చేసుకుంటున్న సుర్జా బాయి అనే 90 ఏళ్ల వృద్ధురాలిపై పడింది. ఆగస్టు 14న ఆమెకు మత్తుమందు ఇచ్చి గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని తన స్నేహితుడి సాయంతో సుప్రియ అత్తగారింటికి తీసుకెళ్లారు. అంతా కలిసి వంటింట్లో పడేసి, పెట్రోల్ పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. మంటలు పెద్దఎత్తున వ్యాపించడంతో ఎదురింటి వారు గమనించి పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపు చేసి కాలిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Crime: బీహార్‌లో ఓ ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయుడిని.. పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు.. అతడి కథేంటో తెలిస్తే..!

సంఘటన స్థలంలో సుప్రియకు చెందిన నగలు దుస్తులు పడి ఉండడంతో.. అంతా ఆమే చనిపోయిందని అనుకున్నారు. ఇదిలావుండగా, ప్రియుడి వద్ద ఉన్న సుప్రియకు పిల్లలను చూడాలనిపించి ఉండలేకపోయింది. దీంతో చేసేదేమీలేక ఉమేష్ ఆమెను ఆగస్టు 16న వారి పుట్టింటికి సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. చనిపోయిందనుకున్న సుప్రియ తిరిగి రావడంతో అంతా షాక్ అయ్యారు. చివరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు వాస్తవం వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానింగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!

Updated Date - 2023-08-23T21:50:14+05:30 IST