భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..

ABN , First Publish Date - 2023-01-15T18:58:45+05:30 IST

దంపతుల మధ్య తలెత్తిన సమస్యలు.. కొన్నిసార్లు పిల్లల మీద ప్రభావం చూపుతుంటాయి. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు ఉన్న కోపాన్ని చివరకు పిల్లల మీద చూపిస్తుంటారు. హర్యానాలో ఇటీవల ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. భర్త పట్టించుకోకపోవడంతో..

భర్త పట్టించుకోకవడంతో దూరంగా ఉంటున్న భార్య.. ఓ రోజు ఎవరూ లేని సమయంలో స్నేహితులతో కలిసి..
ప్రతీకాత్మక చిత్రం

దంపతుల మధ్య తలెత్తిన సమస్యలు.. కొన్నిసార్లు పిల్లల మీద ప్రభావం చూపుతుంటాయి. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు ఉన్న కోపాన్ని చివరకు పిల్లల మీద చూపిస్తుంటారు. హర్యానాలో ఇటీవల ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. భర్త పట్టించుకోకపోవడంతో భార్య కోపం పెంచుకుంది. చివరకు స్నేహితులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేసింది. ఓ రోజు వారితో కలిసి ఇంటికి వెళ్లిన ఆమె చివరకు ఏం చేసిందంటే...

భార్య దూరంగా ఉండడంతో.. మరో ఇంటి తలుపు తట్టిన వ్యక్తి.. బయటికి వచ్చిన ఆమె ముందే..

హర్యానా (Haryana) సోనేపట్ పరిధి జనతా కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తికి సంగీత అనే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్లు సంతోషంగా ఉన్న దంపతుల (couple) మధ్య.. కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. చివరకు ఇద్దరూ దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. భార్యకు దూరంగా ఉంటున్న విజయ్.. ఇద్దరు పిల్లలనూ తన వద్దే ఉంచుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సంగీత తన భర్తపై కోపం (Anger) పెంచుకుంది. తనను దూరం పెట్టడాన్ని భరించలేకపోయింది. చివరకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

వివాహితతో కలిసి బ్యాంకు పని మీద బయటికి వెళ్లిన సహోద్యోగి.. తిరుగు ప్రయాణంలో అడవి మధ్యలో చీకటి పడడంతో..

ఇందుకోసం ఏ తల్లీ చేయని పని చేసింది. ఏకంగా తన కూతురుని కిడ్నాప్ (Kidnapping) చేసి, తద్వారా భర్తపై కసి తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఇదే విషయాన్ని తన ముగ్గురు స్నేహితులకు తెలియజేసింది. అంతా కలిసి ఇటీవల ఓ రోజు పాపను ఎత్తుకెళ్లారు. కూతురు కోసం వెతికినా కనిపించకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భార్య నేరం అంగీకరించడంతో నిందితులు అందరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

డబ్బులు తీసుకుని పరాయి వ్యక్తులను భార్య వద్దకు పంపిన భర్త.. ఓ రోజు స్థానికులు వెళ్లి ఉడుకుతున్న బానలిలో చూడగా..

Updated Date - 2023-01-15T18:59:46+05:30 IST