Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

ABN , First Publish Date - 2023-05-18T12:17:53+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.

Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!

ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో (America) ఓ తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. టెక్సాస్‌లో (Texas) ఈ నెల 12వ తేదీన అదృశ్యమైన పతివాడ లహరి (25) అనే యువతి ఓక్లహామాలో (Oklahoma) అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది. టెక్సాస్‌కు 322 కిలోమీటర్ల దూరంలోని ఓక్లహామాలో లహరి మృతదేహం దొరికింది. ఆమె అదృశ్యమైన న్యూస్ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో ఓక్లహామాలో మృతదేహం ఉన్న విషయం వెంటనే వెలుగులోకి వచ్చింది.

NRI-Tech.jpg

టెక్సాస్‌లోని మెక్‌కిన్నే ప్రాంతంలో నివాసం ఉంటున్న పతివాడ లహరి (Lahari Pathivada) ప్రస్తుతం ఓవర్‌ల్యాండ్‌ రీజనల్‌ మెడికల్‌ సెంటర్‌లో పనిచేస్తోంది. ఈ నెల12న డ్యూటీ ముగిసిన తర్వాత ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. చివరిసారిగా డాలస్‌ నగర శివారులో నల్ల టయోటా కారును నడుపుతూ ఆమె కనిపించారని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. కాన్సాస్ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రురాలైన లహరి, బ్లూ వ్యాలీ వెస్ట్ హై స్కూల్‌లో చదువుకుంది. టెక్సాస్ నుంచి ఓక్లహామా ఎందుకు వెళ్లిందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. అలాగే లహరి ఎలా మృతి చెందిందనేది కూడా మిస్టరీగా ఉంది. ఆమె మృతి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, స్థానికులను విషాదంలో నింపింది.

NRI-T.jpg

Big Ticket draw: రాత్రికి రాత్రే లక్షాధికారులైన ఇద్దరు భారతీయ ప్రవాసులు..!

Updated Date - 2023-05-18T12:23:58+05:30 IST