పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఖరారు.. ఆ కీలక బిల్లుల ఆమోదమే టార్గెట్

ABN , First Publish Date - 2023-09-13T21:52:04+05:30 IST

కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి.

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఖరారు.. ఆ కీలక బిల్లుల ఆమోదమే టార్గెట్

కేంద్రంలోని బీజేపీ సర్కార్ సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ స్పెషల్ సెషన్స్ ని నిర్వహిస్తుండటం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కారణం.. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్ డీఏ కూటమి జమిలీ ఎన్నికలకు వెళ్లనుందనే ఊహాగానాలు. ఈ క్రమంలో సెప్టెంబర్ 13న పార్లమెంట్ సమావేశాలను సంబంధించిన అజెండాను లోక్ సభ, రాజ్య సభ వేర్వేరుగా విడుదల చేసాయి. అజెండాలో నాలుగు కీలక బిల్లులను ప్రస్తావించారు.


అందులో ముఖ్యమైన ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు - 2023, ఎన్నికల కమిషనర్ కు సంబంధించిన బిల్లులు తాత్కాలిక అజెండాలో ఉన్నాయి. జమిలి ఎన్నికలపై స్పష్టత కావాలని ప్రతిపక్షాలు గతంలోనే కోరగా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈ సెషన్స్ లో క్వశ్చన్ అవర్ తదితర కార్యకలాపాలు ఉండవని ఇది వరకే కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2023-09-13T21:56:38+05:30 IST