Share News

Nara Lokesh: ఏపీని సీఎం జగన్‌రెడ్డి గంజాయి మత్తులో ముంచెత్తుతున్నాడు

ABN , First Publish Date - 2023-12-11T22:53:39+05:30 IST

పీని సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్‌ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

Nara Lokesh: ఏపీని సీఎం జగన్‌రెడ్డి గంజాయి మత్తులో ముంచెత్తుతున్నాడు

అనకాపల్లి జిల్లా: ఏపీని సీఎం జగన్‌రెడ్డి ( CM JAGAN REDDY ) గంజాయిమత్తులో ముంచెత్తుతున్నాడని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) అన్నారు. సోమవారం నాడు పాయకరావుపేట నియోజకవర్గం పీఎల్ పురం వద్ద లోకేష్‌ను నిరుద్యోగ యువకులు కలిసి వినతిపత్రం సమర్పించారు.మా ప్రాంతంలో పరిశ్రమలు ఉన్న మాకు ఉపాధి లేని పరిస్థితి, ఏర్పడిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘జె-ట్యాక్స్ విధానాలతో ఉన్న పరిశ్రమలను తరిమేయడం మాత్రమే జగన్ అండ్ కోకు తెలుసు.యువతకు ఉద్యోగాలివ్వడం జగన్‌కి చేతకాలేదు. లక్షలాది ఉద్యోగాలు కల్పించే అమర్ రాజా, ఫ్యాక్స్ కాన్, జాకీ, లులూ వంటి పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం రాష్ట్రం నుంచి తరిమేశాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు ఏర్పాటుచేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. రాష్ట్రం నుంచి ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలసవెళ్లే పరిస్థితులు రాకుండా చేస్తాం’’ అని నారా లోకేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-12-11T22:53:52+05:30 IST