Anam Ramanarayana Reddy: రాజ్యాంగ విలువలని కాలరాస్తున్న జగన్

ABN , First Publish Date - 2023-09-30T20:58:01+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వినబడేలా రాష్ట్రం మొత్తం ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమంతో ఈరోజు తెలుగు ప్రజలంతా నినాదించారని మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు.

Anam Ramanarayana Reddy: రాజ్యాంగ విలువలని కాలరాస్తున్న జగన్

నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి వినబడేలా రాష్ట్రం మొత్తం ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమంతో ఈరోజు తెలుగు ప్రజలంతా నినాదించారని మాజీ మంత్రి అనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణ ఆధ్వర్యంలో కార్లు హరన్లు, స్టీలు గిన్నెలతో సంతపేట మార్మోగింది. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ఇది శబ్ద విప్లవమే. శబ్దమే విప్లవం సృష్టిస్తుంది. ప్రపంచంలో స్థిరపడిన ప్రతి తెలుగువాడు చంద్రబాబు అక్రమ అరెస్టుని వ్యతిరేకస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరికి మేమున్నాం మీకు తోడుగా అని చెపుతున్నాం. జగన్ రాజ్యాంగ విలువలని కాలరాస్తూ, గొంతులు నొక్కుతున్నాడు. లక్షలాది గొంతుకలు ఏకమవుతున్నాయి. కొట్లాది మంది బాబుకి మేమున్నామని అంటున్నారు. న్యాయ స్థానాలు త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాయాని ఆశిస్తున్నాం’’ అని ఆనం రామనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2023-09-30T21:22:07+05:30 IST