Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

ABN , First Publish Date - 2023-10-08T20:25:18+05:30 IST

ఏపీ పోలీసులు(AP Police) మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు.

Bhuma Akhila Priya: పోలీసులు.. మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారు

నంద్యాల: ఏపీ పోలీసులు(AP Police) మనస్సు చంపుకొని విధులు నిర్వహిస్తున్నారని మాజీమంత్రి అఖిలప్రియ(Bhuma Akhila Priya) వ్యాఖ్యానించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తోడుగా.. మేము సైతం అంటూ ఆళ్లగడ్డ పట్టణంలో ఆదివారం నాడు 1000 మందితో భూమా అఖిలప్రియ ర్యాలీ చేపట్టారు. అఖిలప్రియ ఇంటి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకూ శాంతియుతంగా ర్యాలీ తీశారు.ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడతూ..‘‘చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఏ ఒక్కరి అకౌంట్‌లల్లో తప్పుడు నగదు డిపాజిట్ అయ్యిందని సీఐడీ అధికారులు నిరూపించలేక పోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మేమేంటో చూపిస్తాం. ఆళ్లగడ్డలో 100 పడకల ఆస్పత్రి తీసుకు వచ్చే సత్తా భూమా కుటుంబానికి మాత్రమే ఉంది. ఆళ్లగడ్డలో జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన 100 కోట్లలో ఒక్క రూపాయి కూడా స్థానిక ఎమ్మెల్యే(MLA) తెచ్చుకోలేక పోయారు. ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు స్కాం చేయలేదని ప్రజలు నమ్ముతున్నారు. చేతగాని వైసీపీ ప్రభుత్వం ప్రతి పనికి పోలీసు డిపార్ట్మెంట్‌ను అడ్డుపెట్టుకుంటోంది’’ అని వైసీపీ ప్రభుత్వంపై భూమా అఖిలప్రియ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-08T20:25:18+05:30 IST