Share News

Kollu Ravindra : అధికారమే లక్ష్యంగా టీడీపీ - జనసేన కలిసికట్టుగా పని చేయాలి

ABN , First Publish Date - 2023-11-16T22:46:03+05:30 IST

మచిలీపట్నంలో టీడీపీ - జనసేన ( TDP - Janasena ) నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ), జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ దిశా నిర్ధేశం చేశారు.

Kollu Ravindra : అధికారమే లక్ష్యంగా  టీడీపీ - జనసేన కలిసికట్టుగా పని చేయాలి

కృష్ణాజిల్లా, (మచిలీపట్నం) : మచిలీపట్నంలో టీడీపీ - జనసేన ( TDP - Janasena ) నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. నియోజకవర్గ స్థాయిలో జరిగిన ఆత్మీయ సమావేశానికి రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యకర్తలనుద్దేశించి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ( Kollu Ravindra ), జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ దిశా నిర్ధేశం చేశారు. ఈ సమావేశంలో కలిసికట్టుగా నియోజకవర్గ సమస్యలపై టీడీపీ - జనసేన నేతలు కార్యకర్తలు ఒక్కతాటిపై పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారమే లక్ష్యంగా రెండు పార్టీల కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని నియంత పాలన సాగిస్తున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని తనయుడు కిట్టు రాజ్యాంగేతర శక్తిగా మారాడని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Updated Date - 2023-11-16T22:46:18+05:30 IST