MP Avinash Reddy : నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు, సునీత కంకణం కట్టుకున్నారు..

ABN , First Publish Date - 2023-08-03T13:17:38+05:30 IST

పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నేడు అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వైఎస్ వివేకా కూతురు సునీత, అలాగే బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారన్నారు.

MP Avinash Reddy : నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చంద్రబాబు, సునీత కంకణం కట్టుకున్నారు..

కడప : పులివెందులలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలను ఎంపీ అవినాష్ రెడ్డి ఖండించారు. నేడు అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకాహత్య కేసులో తనను, తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చంద్రబాబు, వైఎస్ వివేకా కూతురు సునీత, అలాగే బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు రెండేళ్లుగా కుట్ర పన్నారన్నారు. పులివెందుల ప్రాంతాన్ని జగన్ రెడ్డి అన్నిరకాలుగా అభివృద్ది చేస్తుంటే.. చంద్రబాబు పులివెందులకు అన్ని నిధులు అవసరమా అని అంటున్నారన్నారు. పులివెందులకు ఆదిత్య బిర్లా, అడిదాస్ లాంటి ఇండస్ట్రీలను తీసుకొచ్చారన్నారు.

14 సంవత్సరాలుగా సిఎం గా ఉన్న వ్యక్తి పులివెందులకు ఏం చేశారని అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ ఇచ్చి, కెనాల్స్ అన్నీ రెడీ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, డ్వాక్రా మహిళలను మోసం చేశారని, రైతులకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కరోనాలో రైతుల నుంచి అరటి, చినీ సేకరించి వారికి మద్దతు ధర ఇచ్చామన్నారు. పైడిపాలెం ప్రాజెక్టు వ్యయం 690 కోట్ల అయితే వైయస్సార్ ఉన్నప్పుడే 650 కోట్లు ఖర్చు పెట్టారని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కేవలం 40 కోట్లు ఖర్చుపెట్టి అంతా తామే చేసినట్లు చెబుతున్నారన్నారు. పైడిపాలెంలో మోటార్ల కొనుగోలు నుంచి పైప్ లైన్ల నిర్మాణం వరకూ ప్రతి ఒక్కటి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే పూర్తయ్యాయని అవినాష్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-08-03T13:17:38+05:30 IST