Home » YS Sunitha Reddy
సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే బొమ్మ కనిపిస్తోంది. చెల్లెళ్లు అలుపెరగకుండా చేస్తున్న పోరాటం ఆయన్ను ఇరకాటంలో పడేసింది. గత ఎన్నికల్లో విజయానికి వాడుకున్న చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య.. ఇప్పుడూ ప్రధానాంశంగా మారింది. ఈ హత్య కేసులో జగన్ సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, ఆయన తండ్రి ప్రమేయం ఉందని సీబీఐ అభియోగాలు మోపడం.. వారికి జగన్ అండగా నిలవడం..
ఏపీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 9:30 నుంచి కడప నగరంలో సునీతా రెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం ఉదయం 11.10 గంటలకు కడప కలెక్టరేట్లో నామినేషన్ వేయనున్నారు.
‘హత్య విషయంపై మేం అక్కాచెల్లెళ్లం మాట్లాడుతుంటే వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పట్టుకుంది. అందుకే కోర్టుకు వెళ్లారు. అయినా వీరు వేసిన పిటిషన్లో కోరింది ఒకటి.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ మరొకటి. దీనిపై సుప్రీంకోర్టుకైనా వెళ్తాం’ అని...
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యపై మాట్లాడకూడదంటూ వైసీపీ నేతలు కోర్టుకు వెళ్లడంపై వివేకా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి స్పందించారు. ‘‘న్యాయం కోసం ఇప్పుడు నేను ప్రజల ముందుకు వస్తే.. ఏం చేయాలో తోచక వైసీపీ నేతలకు వణుకు పుట్టి కోర్టు కెళ్లారు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పులివెందులలో వైఎస్ సునీతా రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
‘‘మీ ఫోన్ తీసుకెళ్లి సీబీఐకి ఇవ్వండి. కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోన్ ఇచ్చేదానికి ఏమైంది?’’ అని మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాశ్రెడ్డిని
వైఎస్సార్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డిపై దివంగత నేత వైఎస్ వివేకానంద కూతురు వైఎస్ సునీత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తన రాజకీయ ఆకాంక్షలు, రాజకీయ లక్ష్యాలు లేవని ఆమె స్పష్టం చేశారు. తనకు ఈర్ష్య, ధ్వేషం ఉందనడం సరికాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ అసలు నాకు అవినాశే పరిచయం లేనప్పుడు ధ్వేషం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. ఇక అధికారం అనేది నాకు కొత్త కాదు. ఈ ఫ్యామిలీలో పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను’’ అని అన్నారు.
తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.
YS Sunitha: వైఎస్ వివేకా హత్యకు సంబంధించి ఆయన కుమార్తె వైఎస్ సునీత సంచలన ప్రెస్మీట్ పెట్టారు. జగన్పై జరిగిన దాడి.. తదితర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘కొంగు చాపి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం.. మాకు న్యాయం చేయండి...
మాజీ మంత్రి వివేకానందారెడ్డి హత్య కేసుకు సంబంధించి జై భీమ్ పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి దస్తగిరి (Dastagiri) కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party), కాంగ్రెస్ చీఫ్ షర్మిల (YS Sharmila), వివేకా కూతురు సునీతారెడ్డి వాడుకుంటున్నారని సోమవారం నాడు ఎలక్షన్ కమిషన్ (Election Commission)కి దస్తగిరి ఫిర్యాదు చేశారు.