Share News

AP NEWS అమలాపురం మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రభస

ABN , First Publish Date - 2023-12-11T22:50:33+05:30 IST

మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో ఘర్షణ నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి సత్తెమ్మ తల్లి లేఔట్‌లో మాదిగల రాజకీయ ఆత్మీయ సభను నిర్వహించారు. మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ పాల్గొన్నారు.

AP NEWS అమలాపురం మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రభస

అమలాపురం: మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో ఘర్షణ నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కొంకాపల్లి సత్తెమ్మ తల్లి లేఔట్‌లో మాదిగల రాజకీయ ఆత్మీయ సభను నిర్వహించారు. మాదిగల రాజకీయ ఆత్మీయ సభలో రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ పాల్గొన్నారు. సభలో స్టేజీపై ఫ్లెక్సీలో ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఫొటో లేదని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. సభలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతుండగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయిల్ వర్గీయులకు ఘర్షణ తలెత్తింది.

ఈ దాడిలో యువకులు తోసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యువకులను సర్థి చెప్పేందుకు ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ సైతం వెళ్లడంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు వివాదం మరింత చెలరేగింది. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మార్పీఎస్ ( MRPS ) కార్యకర్తల వైపు దూసుకెళ్లారు. కావాలనే కొందరు గలాటా సృష్టించారని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మండిపడ్డారు. ఇంత పెద్ద మీటింగ్ జరుగుతున్న పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు. అల్లరి సృష్టించిన వారిపై కేసులు పెడతామని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ హెచ్చరించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సదస్సు ద్వారానే బోమ్మి ఇజ్రాయిల్ వెలుగులోకి వచ్చి వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-12-11T22:50:34+05:30 IST