Tirupati : నేడు శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతోందంటే..
ABN , First Publish Date - 2023-09-19T07:53:01+05:30 IST
తిరుమలలో నేడు (మంగళవారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Tirupathi : తిరుమలలో నేడు (మంగళవారం) భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 62,745 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 24,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.