భర్త కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు.. ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అనుకోని విధంగా..

ABN , First Publish Date - 2022-11-16T20:37:29+05:30 IST

భర్త చనిపోవడంతో ఆమె కుటుంబంలో సమస్యలు తిష్టవేశాయి. తర్వాత దగ్గరైన ఓ యువకుడు కూడా ఆమెను వదిలేయడంతో విధిలేని పరిస్థితుల్లో మరో యువకుడితో సహజీవనం చేసింది. అయితే అతను కూడా సరిగా పట్టించుకోలేదు. చివరకు..

భర్త కోసం ఐదు రోజులుగా ఎదురుచూపులు.. ఆకలికి తట్టుకోలేక బయటికి వెళ్లిన తల్లీకూతుళ్లు.. అనుకోని విధంగా..

భర్త చనిపోవడంతో ఆమె కుటుంబంలో సమస్యలు తిష్టవేశాయి. తర్వాత దగ్గరైన ఓ యువకుడు కూడా ఆమెను వదిలేయడంతో విధిలేని పరిస్థితుల్లో మరో యువకుడితో సహజీవనం చేసింది. అయితే అతను కూడా సరిగా పట్టించుకోలేదు. చివరకు మళ్లీ వస్తానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఐదు రోజులవుతున్నా రాకపోవడంతో తల్లీకూతుళ్లు ఆకలితో అలమటించారు. చివరకు కూతురుతో సహా బయటికి వెళ్లిన మహిళ అనుకోని ప్రమాదంలో చిక్కుకుంది. ఈ హృదయ విదారక ఘటనకు సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రేయసికి నిశ్చితార్థం జరుగుతోందని తెలుసుకున్న యువకుడు.. అర్థరాత్రి ప్రియురాలి తండ్రి, అన్న వద్దకు వెళ్లి..

రాజస్థాన్ (Rajasthan) ఉదయపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన భన్వారీ అనే మహిళకు (woman) ఎనిమిదేళ్ల క్రితం ఝడోల్ పరిధి సల్దాతి ప్రాంతానికి చెందిన బాబూలాల్‌తో వివాహమైంది. వీరికి ఇద్దరు సీమ(6), ఖుషి(5) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఐదేళ్ల క్రితం భర్త చనిపోయాడు. దీంతో భన్వారీ అహ్మదాబాద్‌కు వెళ్లింది. అక్కడ ఓ వ్యక్తితో కొన్నాళ్లు సహజీవనం చేసింది. రెండేళ్ల క్రితం అతన్ని వదిలేసి, ఉదయ్‌పూర్‌కు వెళ్లింది. అక్కడ గణపత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకు ఇద్దరూ కలిసి సహజీవనం (Live in relationship) చేశారు. గణపత్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి.

మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

ఈ క్రమంలో గణపత్ ఇల్లు విడిచి వెళ్లాడు. ఐదు రోజులవుతున్నా తిరిగి రాలేదు. దీంతో భన్వారీ, పిల్లలు ఆకలితో అలమటించారు. మంగళవారం కూతురు సీమను తీసుకుని ఉదయ్‌పూర్, కుమ్మరి బట్టీ వద్ద ఉన్న రైలు పట్టాలపైకి వెళ్లింది. కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే పట్టాలపైకి దూకింది. వీరిని ఎదురుగా వస్తున్న రైలు డ్రైవర్ గమనించాడు. బ్రేకులు వేసినా ఫలితం లేకపోవడంతో సుమారు రెండు బోగీలు.. (train accident) వారిద్దిరి పైనుంచి వెళ్లాయి. అయితే అదృష్టవశాత్తు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అధికారులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భన్వారీ భర్తకు ఫోన్ చేసినా స్పందించలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

Updated Date - 2022-11-16T20:37:38+05:30 IST