నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..

ABN , First Publish Date - 2022-11-18T16:23:55+05:30 IST

ప్రేయసి క్షేమాన్ని కోరే యువకులు ఉన్నట్లే.. తమకు దక్కంది ఎవరికీ దక్కొద్దు.. అని కుట్రపన్నే శాడిస్టులు కూడా ఉంటారు. కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో కొందరు..

నాకీ పెళ్లొద్దంటూ వరుడు గొడవ.. అమ్మాయి తల్లిదండ్రులు నిలదీస్తే అతడు చెప్పిన కారణం విని..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేయసి క్షేమాన్ని కోరే యువకులు ఉన్నట్లే.. తమకు దక్కంది ఎవరికీ దక్కొద్దు.. అని కుట్రపన్నే శాడిస్టులు కూడా ఉంటారు. కుటుంబ సమస్యలు, తల్లిదండ్రుల మాటకు విలువ ఇవ్వాలనే ఉద్దేశంతో కొందరు యువతులు.. తమ ప్రేమను త్యాగం చేస్తుంటారు. కానీ ఇలాంటి సందర్భాల్లో వారికి కొన్నిసార్లు ఇబ్బందులు కలుగుతుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నాకీ పెళ్లొద్దంటూ ఉన్నట్టుండీ వరుడు గొడవ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అతన్ని నిలదీశారు. చివరకు అతడు చెప్పిన కారణం విని అంతా షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఆ ఇంటివాళ్లు డిన్నర్ చేస్తుంటే, తన డిన్నర్ మెనూలో వాళ్లనే ఎంచుకుందట…

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీ పరిధి రక్షా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన 20ఏళ్ల యువతికి స్థానిక ప్రాంతానికి చెందిన అయూబ్ ఖాన్ కుమారుడు కల్లె అనే యువకుడితో 7నెలల క్రితం సోషల్ మీడియాలో (Social media) పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి అప్పుడప్పుడూ చాటింగ్ (Phone chatting) చేసుకునేవారు. ఈ చాటింగ్ కాస్త.. కొన్నాళ్లకు ఫోన్ సంభాషణల వరకు వెళ్లిపోయింది. తర్వాత కొన్నాళ్లకు వీడియో కాల్స్ (Video calls) కూడా చేసుకునేవారు. ఆ సమయంలో యువతి ఫొటోలు తీశాడు. వాటిలో అసభ్యకరంగా ఉన్న ఫొటోలను దాచుకున్నాడు. ఇదిలావుండగా, రెండు నెలల క్రితం సదరు యువతికి హన్సారీ ప్రాంతానికి చెందిన యువకుడితో పెళ్లి ఫిక్స్ చేశారు.

నా భార్యను చంపేశా.. వచ్చి అరెస్ట్ చేసుకోండంటూ నేరుగా పోలీసులకే ఫోన్ చేసిన భర్త..!

జవనరి, ఫిబ్రవరి నెలల మధ్య వివాహం జరిపించేలా ఇరువైపు కుటుంబాల వారు మాట్లాడుకున్నారు. త్వరలో తన పెళ్లి ఉండడంతో.. తల్లిదండ్రుల పరువు తీయొద్దనే ఉద్దేశంతో, ఇకనుంచి ప్రేమా గీమా వద్దని యువతి నిర్ణయించుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియా మిత్రుడు కల్లెని దూరం పెట్టింది. అయితే కల్లె మాత్రం పదే పదే ఫోన్లు చేస్తూ విసిగిస్తూ ఉండేవాడు. అయినా ఆమె మాత్రం స్పందించలేదు. ఈ క్రమంలో యువతి పెళ్లి విషయం తెలుసుకున్న కల్లె.. ఎలాగైనా సంబంధాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాడు.

మూడో పెళ్లికి సిద్ధమైన మహిళను.. బైకులో ఎక్కించుకున్న ప్రియుడు.. మార్గమధ్యలో హెల్మెట్ పట్టుకోమని చెప్పి..

చివరకు ఏకంగా పెళ్లి కొడుకు నంబర్ తీసుకుని, యువతి అసభ్యకర ఫొటోలను (young women Indecent photos) పంపించాడు. ఈ ఫొటోలను చూసిన యువకుడు.. నాకీ పెళ్లి వద్దంటూ భీష్మించుకున్నాడు. ఈ విషయం పెళ్లికూతురు తల్లిదండ్రులకు తెలిసి షాక్ అయ్యారు. ‘‘సడన్‌గా పెళ్లి వద్దంటే మా అమ్మాయి భవిష్యత్ ఏం కావాలి.. అసలు కారణం ఏంటో చెప్పు’’.. అని నిలదీశారు. దీంతో యువకుడు వారికి జరిగిన విషయాన్ని తెలియజేశాడు. చివరకు వధువు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు కల్లెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

వివాహానంతరం భర్తను దూరం పెట్టిన వధువు.. మూడో రోజు హనీమూన్‌లో భార్య ముసుగు తీసి చూడగా..

Updated Date - 2022-11-18T16:24:01+05:30 IST