Home » Andhra Pradesh
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలని ఎంపీ కింజరాపు రామ్మో హన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ కోరారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చట్టసభల్లో ప్రవేశించిన పలువురు తొలుత స్థానిక సంస్థల్లో వివిధ రకాల పదవులు అలంకంచారు. తొలి అడుగు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల నుంచే పడింది. శాసనసభకు ఎన్నికై మంత్రులుగా కూడా ప్రాతినిధ్యం వహించారు. జడ్పీ చైర్మన్లగా పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులను సైతం అలంకరించారు. విజయనగరం జిల్లా ఏర్పాటు కాక ముందు ఆ ప్రాంతం కూడా శ్రీకాకుళం జిల్లాలో అంతర్భాగంగానే ఉండేది. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా తొలుత స్థానిక సంస్థల్లోనే ప్రాతినిధ్యం వహించారు.
దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీ్షవారిపై భారతీయులు సాగించిన పోరాటంలో ఓటుహక్కు ఉద్యమం ఒకటి. నాటి పాలనలో అంతర్భాగమైన స్థానిక సంస్థలకు 1907లో నిర్వహించిన ఎన్నికల్లో భారతీయులకు ఓటు హక్కు కల్పించాలని ఉద్యమం సాగించారు.
అద్దెకు కార్యకర్తలు దొరుకుతారన్న మాట వినడానికి ఆసక్తిగా ఉన్నా వాస్తవమే. గతంలో రాజకీయపార్టీల నాయకులు స్వచ్ఛందంగా పిలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చే వారు. ప్రస్తుతం ప్రజల ఆలోచన ధోరణి, వ్యవహార శైలి మారింది. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రచారానికి డబ్బులు ఇవ్వనిదే ముందుకురావడం లేదు. జిల్లాలో ఇటీవల కాలంలో ఓ ప్రాంతంలో రెండు ప్రధాన పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, సభలకు వచ్చిన వారే మళ్లీ రావడం విశేషం. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేస్తారోలేదనని సందేహం వ్యక్తంచేస్తున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని ఎన్ని కల పరిశీలకుడు సందీప్ శర్మ వివిధ పార్టీల నేతలను అన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై ఎక్సైజ్, సెబ్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని విశాఖపట్నం సెబ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీరామ చంద్ర మూర్తి ఆదేశించారు.
గతంలో ఎన్నికలు వచ్చాయంటే గోడ కనబడితే ప్రచార ప్రకటనలు కనిపించేవి. గోడలపై అభ్యర్థులు పేరు, పార్టీ, గుర్తు తదితర వివరాలు బొమ్మలుగా వేసే వారు. పదేళ్ల కిందటి వరకు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా పార్టీల నాయకులు ఖాళీగా ఉన్న గోడలను రిజర్వ్ చేసుకునేవారు. పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడమే ఆలస్యం. వెంటనే ప్రచార రాతలతో గోడలను నింపేసే వారు. ఎన్నికల సమయంలో వివాహం వంటి శుభకార్యాలు ఉన్నా సరే ఇంటింటికి రంగు వేయిం చుకునేందుకు యజ మానులు వెనుకాడేవారు. కాలక్రమేణ గోడమీద రాతలు మాయమయ్యాయి. సోషల్ మీడియా పుణ్యమాని మునుపటి ప్రచారం రాతలు కనుమరుగయ్యాయి. దీంతో అప్పటిదాకా గోడమీది రాతలతో ఉపాధి పొందుతున్న కార్మికులకు కూడా పనిలేకుండా పోయింది.
తారు రోడ్డు వేస్తామని అప్పటి వరకు ఉన్న మట్టి రోడ్డును తవ్వేశారు. రోడ్డుపై కంకర వేశారు. తరువాత సిమెంట్ కానీ, తారు కానీ వేయడం మ రచిపోయారు. దీంతో అది కంకర రోడ్డుగా మారిపోయిం ది. ఇదీ మండలంలోని కల్లూరు గ్రామం కొండకింద మారుతీనగర్లో రోడ్డు దుస్థితి. కాలనీ నుంచి సింగరప్ప కొండ దేవాలయానికి వెళ్లే ప్రధాన రహదారి పనులను సుమారు రూ.90 లక్ష ల ఉపాధి నిధులతో ఆరునెలల కిందట ప్రారంభించారు.
ఈ ఎన్నికల్లో నేను 16వ సారి ఓటు వేయనున్నా ను. 1952లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసిన బొడ్డేపల్లి రాజగోపాలరావుకు తొ లిసారి ఓటు వేశాను. అప్పట్లో జరిగిన ఎన్నికల ప్రచా రానికి మొదట్లో నాటు బళ్లు, కొన్నాళ్ల తర్వాత విశాఖ నుంచి ఆటోలను తీసుకొచ్చి ప్రచారం చేసేవారు. మా ప్రాంతమంతా వంశధార నది అవతల ఉన్న నగరికట కం నియోజకవర్గంగా ఉండేది. నియో జకవర్గ కేంద్రాని కి చేరుకోవాలంటే ఎటువంటి వంతెన ఉండేది కాదు. నది దాటుకొని వెళ్లేవారం. నగరికటకం నియోజకవర్గం గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఓటర్లంతా రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రస్తుత ఎల్ఎన్ పేట మండలంలోని సిద్దాంతం గ్రామంలో ఓటు వేయ డానికి కాలినడకన వెళ్లేవాళ్లం. కొత్త గా ఆమదాలవలస నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కూడా సిద్దాంతం గ్రామంలోనే ఓట్లు వేయాల్సి వచ్చింది.