మద్యం అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించండి
ABN , Publish Date - Apr 29 , 2024 | 11:55 PM
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై ఎక్సైజ్, సెబ్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని విశాఖపట్నం సెబ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీరామ చంద్ర మూర్తి ఆదేశించారు.
శ్రీకాకుళం క్రైం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై ఎక్సైజ్, సెబ్ శాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని విశాఖపట్నం సెబ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీరామ చంద్ర మూర్తి ఆదేశించారు. సెబ్ కార్యాలయంలో సోమవారం ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఉమ్మడి దాడులు చేయాలని, రికార్డులు పరిశీలిం చాలన్నారు. అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బి.శ్రీనివాసులు, ఏఈఎస్ టి.రాజశేఖర్, సెబ్ ఈఎస్ తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.