Home » Telangana » Rangareddy
జిల్లాలో సాగుకు అనువుగా లేని భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం బంట్వారం ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.
పరిగి ఆర్టీసీ బస్టాండ్లో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం సాల్వీడ్ గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్లో టెట్ పరీక్ష రాసింది.
జిల్లా ఎక్సైజ్ ఈఎస్ విజయ భాస్కర్, ఏఈఎస్ శ్రీనివా్సరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తాండూరు ఎక్సైజ్ ఎస్హెచ్వో బాలగంగాధర్ శనివారం తాండూరు రైల్వే స్టేషన్, పార్కింగ్ పరిసరా ప్రాంతాలలో గంజాయి సేవిస్తున్న వారికి, విక్రయాలు చేసే వారికి, వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు.
బస్సు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బొంరా్సపేట్ మండలంలో జరిగింది.
బైక్ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్లో చోటుచేసుకుంది.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఆ పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. నాయకుల మధ్య రోజు రోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. ప్రజా ప్రతినిధులు, నేతల పనితీరుపై ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
2027 నాటికి దేశంలో పూర్తిగా లెప్రసీ(కుష్ఠు)ని నిర్మూలించడమే ప్రభుత్వ ఉద్దేశమని, ఆ దిశగా చర్యలు తీసుకుంటోందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటరవణ అన్నారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో పీహెచ్సీ కేంద్రాల లెప్రసీ నోడల్ ఆఫీసర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు లెప్రసీ కేసులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు నూతనంగా ప్రవేశ పెట్టిన పోర్టల్ గురించి శిక్షణ ఇచ్చారు.
హైదరాబాద్లో శుక్రవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ పథకాల అమలుపై గ్రామాల్లో గ్రామ సభలు, మునిసిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించాలని ఆదేశించారు.