32 ప్యాకెట్ల చైనా మాంజా స్వాధీనం
ABN , Publish Date - Jan 11 , 2025 | 11:46 PM
జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు.
తాండూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు. షాపు యజమాని సచిన్ నుంచి రూ.6400విలువ చేసే 32ప్యాకెట్ల చైనా మాంజానుస్వాధీనం చేసుకొని సచిన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎవరైన ప్రభుత్వ నిషేదిత చైనా మాంజాను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు సచిన్ను తాండూరు టౌన్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.