Share News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Jan 11 , 2025 | 11:43 PM

బైక్‌ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

కులకచర్ల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): బైక్‌ ఢీకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతిచెందింది. ఈ ఘటన కులకచర్ల మండలంలోని పుట్టపహాడ్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గొల్ల వెంకటయ్య పెద్ద భార్య బందెమ్మ(55) శుక్రవారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి అనంతసాగర్‌, పుట్టపహడ్‌ దారిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అనంతసాగర్‌ గ్రామానికి చెందిన వడ్డె నవీన్‌ బైక్‌పై అతివేగంగా వచ్చి బందెమ్మను ఢీకొట్టాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను పాలమూర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 11 , 2025 | 11:43 PM