Home » Telangana » Rangareddy
మండల కేంద్రంలో ఒకే రోజు మూడుచోట్ల చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వైన్షా్పలోని గల్లలో ఉన్న చిల్లర రూ.500 నగదుతో పాటు రెండు క్వార్టర్బాటిళ్లు, ఒక బీరును దొంగిలించారు.
ఉమ్మడి జిలాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వానాకాలం ( ఖరీఫ్) సీజన్లో విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ యాసంగి (రబీ) సీజన్లో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో భూగర్భజలాలు పెరగలేదు. మరోవైపు నీటి వినియోగం పెరగడంతో శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు భూగర్భజలాల పరిస్థితి పరిశీలిస్తే ఒక్క నెలలోనే సగటున మీటర్ లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి.
రానున్న ఉగాది నుంచి పౌర సరఫరాల దుకాణాలలో సన్నబియ్యం ఇవ్వటానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శనివారం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల అమలుపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన సదస్సును రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించారు.
ఈనెల 26 నుంచి ప్రభుత్వం రైతుభరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ఎన్ని నిధులైనా కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో రూ.2.20కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
వికారాబాద్ మునిసిపాలిటీ దీనస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. జిల్లా కేంద్రం.. బల్దియాలో కనీసం కార్మికులకు జీతాలు కూడా ఇవ్వని పరిస్థితి. చెక్కుల రూపంలో ట్రెజరీకి పంపిన జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. సాధారణ నిధుల నుంచి నేరుగా కార్మికులకు ప్రతీనెల అందించే అధికారులు.. ఈనెల మాత్రం ట్రెజరీకి చెక్కులు పంపించి చేతులు దులుపుకున్నారు.
జిల్లాలో సాగుకు అనువుగా లేని భూముల వివరాలను జిల్లా రెవెన్యూ యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.
బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు శనివారం బంట్వారం ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తెలిపారు.
పరిగి ఆర్టీసీ బస్టాండ్లో శనివారం రాత్రి చైన్ స్నాచింగ్ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కులకచర్ల మండలం సాల్వీడ్ గ్రామానికి చెందిన అనిత హైదరాబాద్లో టెట్ పరీక్ష రాసింది.
జిల్లా ఎక్సైజ్ ఈఎస్ విజయ భాస్కర్, ఏఈఎస్ శ్రీనివా్సరెడ్డి ఆధ్వర్యంలో శనివారం తాండూరు ఎక్సైజ్ ఎస్హెచ్వో బాలగంగాధర్ శనివారం తాండూరు రైల్వే స్టేషన్, పార్కింగ్ పరిసరా ప్రాంతాలలో గంజాయి సేవిస్తున్న వారికి, విక్రయాలు చేసే వారికి, వారి పేరెంట్స్కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
జిల్లా టాస్క్ఫోర్స్ పోలీస్ అధికారులు శనివారం తాండూరు పట్టణంలోని గాలిపటాలు అమ్మే దుకాణాలపై దాడులు నిర్వహించారు.