Home » Telangana » Rangareddy
మండల పరిధిలోని తీగాపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మండల పూజలో భాగంగా సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయం 41 రోజులు పూర్తి చేసుకోవడంతో గ్రామ ప్రజలు మండల పూజ నిర్వహించారు. ప్రతిష్ఠ వైదిక పురోహితులు, ఛండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ ఆధ్వర్యంలో పురోహితులు సీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.
మండలంలోని పలు గ్రామాల పరిధిలోని వ్యవసాయేతర భూములు, నాపరాళ్ల గుట్టలకు పెద్ద ఎత్తున రైతుబంధు పథకం కింద చెల్లింపులు జరిగినట్లు తేలింది.
అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు.
కళాశాలకు బైక్పై వెళ్లుతున్న విద్యార్థులు మరో బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మోమిన్పేట్ పోలీ్సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
శుద్ధ తాగుజలాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తాయని టాస్క్ సీవోవో, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తు ఉంటుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగర్కుంట గ్రామంలో మల్లి మహేష్ తండ్రి జంగయ్య జ్ఞాపకార్థం క్రికెట్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి మొదటి బహుమతి షాబాద్ జట్టుకు రూ.10వేలు.. రెండో బహుమతి నాగర్కుంట జట్టుకు రూ. 5వేల నగదుతో పాటు ట్రోఫీని అందజేశారు.
ఇబ్రహీంపట్నం చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలను సమర్పించారు.
వ్యవసాయ పెట్టుబడికి రుణాలు, విత్తనాలు, ఎరువులు అందించి సహకార సంఘాలు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.