ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:05 AM
అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు.
జేసీబీ, ట్రాక్టర్ స్వాధీనం
మర్పల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రభుత్వ భూమిని చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. మర్పల్లి మండలంలోని కోట మర్పల్లి గ్రామంలో సర్వే నెం.98, 92లో గల ప్రభుత్వ భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గత రెండు, మూడు రోజులుగా జేసీబీతో చదును చేస్తూ ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమాచారం అందుకున్న మర్పల్లి తహసీల్దార్ మునిరోద్దీన్, ఎస్సై సురేశ్ సోమవారం ఘటనాస్థలానికి చేరుకొని అక్కడ జేసీబీ, ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు.