జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఎన్నికల్లో ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఒక వ్యాపార సంస్థకు చెందిన జీఎస్టీ ఖాతా లాగిన్ వివరాలను మార్చేసి.. ఏకంగా రూ.183.61 కోట్ల విలువైన 730 నకిలీ ఇన్వాయి్సలు, అనధికార ఈ-వే బిల్లులు సృష్టించిన భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
ఒకే మహిళతో నడుపుతున్న వివాహేతర సంబంధం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసి, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది.
కొందరికి ఇండియన్ టాయిలెట్ బేసిన్ అలవాటు. వృద్ధాప్యం, మోకీలు, తుంటి సమస్యలతో కొందరు దాన్ని వినియోగించుకోలేని స్థితి. అలాంటి వారికి వెస్టర్న్ తరహా టాయిలెట్ బేసిన్ అనుకూలం.
ప్రభుత్వంలోని ఓ శాఖలో కీలక బాధ్యతలు చూస్తున్న ఐఏఎస్ అధికారిణి రూ.2.5 కోట్లు ‘నజరానా’గా పుచ్చుకొని ఓ సంస్థకు ఏకపక్షంగా కాంట్రాక్టు కట్టబెట్టిన వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వందల కోట్ల రూపాయల ఆస్తులను వెనకేసిన మహిళా తహసీల్దార్ ఏసీబీ ఉన్నతాధికారుల ప్రసన్నం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనను సక్రమంగా చూపించుకోవడానికి మరోవైపు చార్టెర్డ్ అకౌంటెంట్ల చుట్టూ తిరుగుతున్నట్లు సమాచారం.
రాష్ట్ర జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న రంగారెడ్డి జిల్లా, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ తన సత్తా చాటుతోంది. ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్ రంగాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ జిల్లాలో డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని చెరువులు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యాయని, చాలా చెరువులు ఆక్రమణల పాలయ్యాయని తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆక్షేపించింది. చెరువుల శిఖం భూముల్లోనే లే-అవుట్లు వేసిన దౌర్భాగ్యకర పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది
శాసనమండలి సభ్యుడు మీర్జా రహ్మత్ బేగ్ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మజ్లిస్ ప్రకటించింది. తక్షణమే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఆయన్ను ఆదేశించింది.
పార్కులు, చెరువులు, ట్యాంక్బండ్ వంటి ఆహ్లాదభరిత పర్యావరణంతో చల్లగా ఉండే హైదరాబాద్.. కాంక్రీట్ నిర్మాణాలతో క్రమేణా నిప్పుల కుంపటిగా మారుతోంది. గత 13 ఏళ్లలో నగరం ఉపరితల ఉష్ణోగ్రతలు ఏకంగా 4.4 డిగ్రీల సెల్సియస్ పెరిగాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.