నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో కొందరు చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం అల్పాహారం అందిచాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలిముద్ద పథకాన్ని అమలు చేస్తోంది. బాల్యదశలోనే చిన్నారులకు వయస్సుకు తగిన పౌష్టికాహారం అందిస్తే చిన్నారులు పౌష్టికాహార లోపం బారిన పడకుండా ఎదుగుతారు. ఇటీవల అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్రెడ్డి, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఈ కార్యక్రమా న్ని ప్రారంభించారు. జిల్లాలోనూ ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందజేయాలని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్రావ్ అన్నారు. స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో బుధవారం జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాల అంగన్ వాడీలకు సర్పంచ్ కొడప ప్రకాష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మోబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఉపాధి హామీ కూలీలకు వంద రోజుల పని కల్పించానలి డీఆర్డీవో దత్తారావు అన్నారు. గోయగాం గ్రామ పంచాయతీ పరిధిలోని భీమన్గొంది గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాటాద్లడుతూ జాబ్ కార్డుదారులందరికి వంద రోజుల పని కల్పించానల్నారు
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కెహరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఏర్పాటు చేసిన అభివృద్ధి కమిటీ సమావేశానికి ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ ప్రవీణ్కుమార్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబోద్కుమార్లతో కలిసి హాజరయ్యారు
అన్నదాత లకు ఏటా పెట్టుబడి భారంగా మారుతోంది. సీజన్ ప్రారంభంలో దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చి మార్కెట్లో విక్రయించేదాక రైతులు పెట్టుబ డులు పెట్టాల్సిందే. వ్యవసాయమే ప్రధాన జీవనధా రమైన జిల్లాలో పంటలపై రోజు రోజుకు సాగు భారం ఎక్కువవుతున్నది. ఏటా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో వానకాలం పంటల సాగుకు చేలను సిద్ధం చేసే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు.
సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు ఎన్ఐఏ(NIA) నోటీసులు ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఖండించారు. తాము బహిరంగ ఉద్యమాలు చేశామే తప్ప ఎక్కడా సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహించలేదని ఆయన అన్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో రెండు నూతన విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు తెలిపారు.