చంచల్గూడ జైలు ములాఖత్లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ రవి కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గతేడాదే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఈ మధ్యనే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ వచ్చింది. అయితే.. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వివరాల్లోకి వెళితే..
ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్హౌస్ పనులను పరిశీలించారు.
బీజేపీ, కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ నేపథ్యంలో కామారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల కబ్జా వ్యవహారంపై రెండు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ వివాదంపై నిజానిజాలు తేల్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సవాల్ విసిరారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజారతను ఇంటాంజియబుల్ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేట్టు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కృషిచేయాని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు.
దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్లో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ మొబైల్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 65, బజ్జి మిర్చి 35, కాకరకాయ 35, బీరకాయ 38లకు విక్రయిస్తున్నారు.
టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో 220కేవీ లైన్, సమ్మర్ యాక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో సబ్స్టేషన్స్లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.