హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్లైన్లో విడుదల చేశారు.
భారతదేశ ఇంధన రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేలా, దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత రెసిడెన్షియల్ సోలార్ సర్వీసెస్ ప్లాట్ఫారమ్ 'రెంజీ అందుబాటులోకి వచ్చింది. దీంతో మీ ఇంట్లోనే విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకోవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈ రోజు భేటీ అయ్యింది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై మంత్రిమండలి చర్చించింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్ హాలీడే తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో మే 27న కాకుండా మే 28న హాలిడేగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది కోట్లు పెడతామని మల్టీ నేషనల్ కంపెనీలు వస్తున్నాయని.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే పెట్టుబడిదారులు భయపడరా అని మండిపడ్డారు.
2022లో దీపావళి రోజున మొదలైన రోజ్గార్ మేళా ద్వారా ఇప్పటివరకు 12.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది కేవలం ఉద్యోగాల కార్యక్రమం కాదని, యువత భవిష్యత్తు కోసం మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెద్ద మిషన్ అని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా హీట్ వేవ్పై హై అలర్ట్ ప్రకటించినట్లు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. తీవ్ర ఉష్ణోగ్రతలపై మంత్రి పొంగులేటి సచివాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.
హైదరాబాద్లోని మాసబ్ట్యాంక్ వద్ద కారు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యాయవాది తుదిశ్వాస విడిచారు.
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్రెడ్డి సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సెంట్రింగ్ కార్మికులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు.