టీజీఎస్పీడీసీఎల్ బాలాజీనగర్ సెక్షన్ పరిధిలో 220కేవీ లైన్, సమ్మర్ యాక్షన్ పనులు జరుగుతున్నాయి. దీంతో సబ్స్టేషన్స్లో మరమ్మతుల నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ భీమాలింగప్ప ఓ ప్రకటనలో తెలిపారు.
గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గురుకులాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
హిందూ దేవుళ్లనే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేశ్ వ్యాఖ్యలు చేశారని ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ ముందంజలో నిలవాలంటే కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు..
ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో కస్టమర్లు భయంతో బయటకు పరుగులు తీశారు.
నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు అందింది. దీంతో శుక్రవారం కోర్టు ప్రాంగణంలోని న్యాయవాదులు, కక్షిదారులను ఆగమేఘాల మీద బయటకు పంపి.. ఆ ప్రాంగణంలో బాంబు, డాగ్ స్వ్కాడ్తో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
అమీర్పేటలో అగ్నిప్రమాదం జరిగింది. మైత్రివనంలోని నీలగిరి బ్లాక్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్- తిరుపతి మార్గంలో నడుస్తున్న రాయసీమ ఎక్స్ప్రెస్ (12793 నంబర్) రైలుకు బొల్లారం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు.
పోస్టల్ సేవలు నిరంతరాయంగా, వేగవంతంగా కొనసాగుతున్నాయి. తపాలశాఖను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు యంత్రాంగం నిర్విరామంగా కృషి చేస్తోంది.