హైదరాబాద్ పరిధిలోని జీడిమెట్లలో భాపీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. దుండిగల్ సమీపంలోనూ ఓ అగ్నిప్రమాదం సంభవించింది.
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి రూ.20లకు విక్రయిస్తున్నారు.
ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం జగిత్యాలకు కేటీఆర్ చేరుకోనున్నారు.
సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హరీశ్ రావుకు వనపర్తి జిల్లాలో పర్యటించేందుకు అనుమతినిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రెహ్మాన్ ద్విచక్రవాహనానికి ఈ-చలాన్ విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మెసేజ్ పంపారు. దీంతో షాక్కు గురైన అతను వెంటనే అప్రమత్తమయ్యాడు. తన వద్ద స్కూటీ లేదు కదా.. చలానా ఏంటని మెసేజ్ ఓపెన్ చేశాడు.
విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాయి. వారికి వేసవి సెలవులు ప్రకటించేశారు. దీంతో తల్లిదండ్రులతో కలిసి వారంతా ఊర్లకు ప్రయాణం అవుతున్నారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో రవాణా వాహనాలు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నా.. రేవంత్ వైపు గాలి వీచిందని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
కేసీఆర్ హయాంలోని పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఒడిపోదని తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ భవన్ ముట్టడికి ఉద్యమకారుల జేఏసీ యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఉద్యమకారులను బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదని జేఏసీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.