సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ -2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని.. కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గురువారం తెలంగాణలో పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్ ఖరారైంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్( కార్పొరేట్ వ్యవహారాలు) రాకేశ్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి ఈరోజు(బుధవారం) కలిశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెగిటివ్ మైండ్సెట్తో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయమంటే ఎన్డీఎస్ఏ సాకు చెబుతున్నారని.. మరి సమ్మక్క బ్యారేజీ మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయదల్చిన తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఆర్పీడీసీఎల్) ఏర్పాటులో కొత్త మలుపు చోటుచేసుకుంది.
తెలంగాణ ఎగువ మధ్యాదాయ స్థాయిని దాటిన సంపన్న రాష్ట్రమంటూ ప్రపంచబ్యాంకు నివేదికను వెల్లడించడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్లోని ఆస్మాన్ఘడ్ డివిజన్ పరిధిలో మరమ్మతు పనుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, ప్రస్తుత పరిస్థితులు, ప్రాజెక్టు రీడిజైన్, నిర్మాణంలో అవినీతి వంటి అంశాలను ప్రజాభవన్ వేదికగా పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్ రెడ్డి వెల్లడించారు.
గురుకులాలు, హాస్టళ్లలో క్లీన్ అండ్ గ్రీన్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఉన్నతాధికారులకు రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ను కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.