Home » Telangana » Hyderabad
Telangana: తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాదులు గట్టు వామన్ రావు దంపతుల హత్య వ్యవహారంపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. గట్టు వామనరావు దంపతుల హత్యపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టులో వామనరావు కొడుకు గట్టు కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా సీఐడీతో లేదా సీబీఐతో అయినా తిరిగి విచారణ జరిపించేందుకు తమకు అభ్యంతరం లేదని..
అసలే మే నెల. భానుడి భగభగలు ఏ స్థాయిలో ఉంటాయే తెలిసిందే. మే నెల చివరి వారం వరకు ఉష్ణోగ్రతలు సరికొత్త రికార్డులను నమోదు చేస్తాయి. అయితే కొన్ని రోజుల క్రితం భారత వాతావరణ శాఖ హైదరాబాద్ సహా పలు జిల్లాలకు హీట్ వేవ్ హెచ్చరికలు(Heat Wave Alerts) జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఉత్తరప్రదేశ్ వెళ్లనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి యూపీకు బయలుదేరనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు.
తెలంగాణలో ఐసెట్ (TS ICET) దరఖాస్తులకు గడువు పొడిగించారు.మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే మే 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరికి, ఎంతమందికి దత్తపుత్రుడో చెప్పాలని, న్యాయ ప్రక్రియ అడ్డుకోవడం దురదృష్టకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంధ్రకుమార్ అన్నారు.
హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీష్తో పాటు నవీన్, తస్లీమాను అరెస్ట్ చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Telangana: దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్ కమిషన్ నివేదిక ఆధారంగా సదరు అధికారులపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసు అధికారులు, షాద్నగర్ తహసిల్దార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈరోజు(బుధవారం) ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగగా..
హైదరాబాద్: రాజేంద్రనగర్, నార్సింగీ, సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా నైజీరియన్స్ నివశించే ఇండ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న నైజీరియన్ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్కు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది.