Home » YSRCP
సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మండిపడ్డారు. ఏపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతోందని అన్నారు. ఏపీ ప్రగతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత్ర కీలక పాత్ర పోషించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహరావుకి సైతం భారతరత్న ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానికి చెందుతుందని అన్నారు.
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండగా.. వైసీపీ తన అధికారాన్ని ఉపయోగించి విపక్షాలపై కక్షసాధింపులకు పాల్పడుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా పోలింగ్కు వారం రోజుల ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, యువనేత లోకేష్పై కేసు పెట్టడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అధికారం ఉందనే అహంకారం, తాను ఏం చేసినా చెల్లుతుందన్నట్లు వైసీపీ అధినేత జగన్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీకి(YSRCP) రాష్ట్ర వ్యాప్తంగా షాక్లు తగులుతున్నాయి. తాజాగా తిరుపతికి చెందిన పలువురు కీలక ప్రజాప్రతినిధులు, నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ, జనసేన కండువా కప్పుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం కొద్ది రోజులుగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చుట్టూ తిరుగుతోంది. ప్రజల భూములు లాక్కునేందుకు వైసీపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటూ టీడీపీ, జనసే, బీజేపీ కూటమి నేతలతో పాటు.. ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎన్నికల ప్రచారంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే పేద ప్రజల భూములకు రక్షణ ఉండదనే విమర్శలు వస్తున్నాయి. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై వివాదం నడుస్తున్న వేళ.. ఈ చట్టానికి సంబంధించిన అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ చట్టంలో సంబంధించిన పలు అంశాలు అనుమానస్పందగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) కుమార్తె క్రాంతి భారతి మరో సంచలనానికి తెరదీశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ను ఓడిస్తానని చెప్పడం.. ఆ తర్వాత పేరు కూడా మార్చుకుంటానని ముద్రగడ చేసిన ప్రకటనపై క్రాంతి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్కు స్పందించిన ‘కూతురు నా ప్రాపర్టీ కాదు’ అని చెప్పడం పెద్ద సంచలనమే అయ్యింది. తాజాగా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలో అపశృతి చోటు చేసుకుంది. శనివారం జిల్లాలోని పలమనేరులో సీఎం జగన్ సభ నిర్వహించారు. అయితే జగన్ సభకు హాజరైన ప్రజల్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. సభకు వచ్చిన జనానికి వైసీపీ శ్రేణులు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. అయితే వీటిని తాగిన పలువురకి అనారోగ్యం పాలయ్యారు. వాంతులు అవడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
Andhrapradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద పవన్ కళ్యాణ్ అవగాహనలేకుండా.. ఊగుతూ మాట్లాడం ఏమిటి? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ మాటలను ఎందుకు పట్టించుకోవాలన్నారు. ఆయన మాట్లాడే భాష ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? ఇటువంటి వ్యాఖ్యలను ఎవరైనా హర్షిస్తారా అని మండిపడ్డారు. ఆయన భాష ఏంటి, ఆయన హావభావాలు ఏంటని అడిగారు.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. శనివారం దర్శి ప్రజాగళం బహిరంగ సభలో టీడీపీ అధినేత మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి.. అధికారంలోకి వచ్చాక బాదుడే బాదుడుకు తెరతీశారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలకు జగన్ ఖర్చుపెట్టింది చాలా తక్కువే అని.. దీంతో ఏం చెప్పాలో తెలీక జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.