Home » YSRCP
వైసీపీ మండలి సభ్యులు అసెంబ్లీ బయట ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి ప్లకార్డులతో నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన చేస్తున్నారు.
ఐదేళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని దేవినేని విమర్శించారు.
తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డిలకి ముసళ్ల పండగ ముందుందని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.
సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భారీగా దోచుకున్నారని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. స్వామి వారి హుండీని వైసీపీలోని కీలక నేతలు దోచుకున్నారని విమర్శించారు.
పల్నాడులో వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. ప్రజలపై వైసీపీ నేతలు దాడులు చేస్తే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
మచిలీపట్నం పోలీసు స్టేషన్లో 40 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ నేతలు దేవినేని అవినాష్, ఉప్పాల రాము, పేర్ని కిట్టుతో సహా సుమారు 40 మందిపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. PMLA కింద ECIR నమోదు చేశారు ఈడీ అధికారులు. దేశ వ్యాప్తంగా 20 ప్రదేశాల్లో సోదాలు చేశారు.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన కంపెనీలు, ఇళ్లల్లో సిట్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మెడికల్ కాలేజ్కు వెళ్లి తీరుతామని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. దిమ్మల సెంటరు సమీపంలో సమీకరణ అవుతున్నారు వైసీపీ శ్రేణులు.