Home » YS Jagan Mohan Reddy
అవినీతి డబ్బుతో జగన్లా తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేమూరి రాధాకృష్ణ పత్రిక పెట్టుకోలేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాధాకృష్ణ జర్నలిస్టుగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి పత్రిక పెట్టుకున్నారని మంత్రి తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు.
ప్రపంచంలో తెలుగువారంతా గర్వించే నగరం అమరావతి అని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని పార్టీలు అమరావతినే రాజధానిగా కావాలన్నారని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొట్టారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రిగా, సాక్షి దినపత్రికకు అధిపతిగా ఉండి సంయమనం పాటించకుండా దూషణలు చేయడం సరికాదని వైఎస్ జగన్పై మంత్రి పార్థసారథి మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధమన్నారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై కొంతమంది రౌడీలతో రౌడీయిజం చేసి అందరినీ భయభ్రాంతులకు గురి చేసిన విధానాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యానికి మూలస్తంభం అయిన పత్రికా వ్యవస్థపై దాడిగా భావించాలన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లలో గోదావరి జిల్లాల్లో కాలువలో కనీసం మట్టి కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు.
వైసీపీ హయాంలోని ఐదేళ్లు విధ్వంసమే అజెండాగా పాలన సాగించారని తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రజలు వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పినా తీరు మాత్రం మారలేదని ఆగ్రహించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ఎదుట వైసీపీ ఆందోళనలు చేయడంపై జనసేన అగ్రనేతలు స్పందించారు. మంగళవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారని అన్నారు.
వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై జనసేన అగ్రనేతలు అధికారిక లేఖ విడుదల చేశారు. విమర్శలు, వ్యాఖ్యానాలపై స్పందించడంలో ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలని పేర్కొన్నారు.