Home » yoga meditation
విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. విశాఖలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నంలో జూన్ 21న జరిగే యోగా దినోత్సవానికి 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యమని తెలిపారు.
విశాఖపట్నం పరిధిలోని బౌద్ధ ఆరామం తొట్లకొండపై యోగాంధ్ర మాసోత్సవాలలో యోగాసనాలు నిర్వహించబడ్డాయి. మయన్మార్, కాంబోడియా బౌద్ధ గురువులు, కలెక్టర్ హరేంధిరప్రసాద్ సహా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Yogandhra 2025: కామన్ యోగాసనాలతో అనేక రుగ్మతలును దూరం పెట్టవచ్చని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు చెప్పుకొచ్చారు. నేడు బిజీ లైఫ్లో అందరూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని.. బీపీ, షుగర్లు, ఇతర జబ్బులు పెరుగుతున్నాయన్నారు. యోగాసనాల ద్వారా వీటిని శరీరంలోకి రాకుండా చేయవచ్చని తెలిపారు.
జిల్లాలో జూన్ నాల్గవ తేదీ నుంచి వేరుశనగ విత్తనకాయల పంపిణీ చేపట్టనున్నట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి మురళీకృష్ణ తెలిపారు.
Yogandhra 2025: రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశించేలా అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల సరళమైన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు ఉంటాయన్నారు.
Yoga: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల రోజుల పాటు ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం యోగా చేయాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ పిలుపిచ్చారు. మన శరీరం, మనసును ఆధీనంలో ఉంచుకునేందుకు యోగా ఎంతో ఉపయోగ పడుతుందన్నారు.
ఆరోగ్యకరమైన జీవనానికి యోగా చాలా మంచిదని మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైనా అలసట వస్తే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తే గొప్ప రిలీఫ్ వస్తుందన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరో గ్యం సాధ్యమని యోగాంధ్ర క్యాంపెయిన నోడల్ ఆఫీసర్ డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి పిలుపునిచ్చారు. యోగాంధ్ర క్యాంపియనలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా యంత్రాంగం తరఫున బారీ అవ గాహన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీని డీఎంహెచఓ ప్రారంభించారు.
CM Chandrababu Yoga Day: ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఫొటోలు, ఈవెంట్ కోసం ఒక రోజు చేసే కార్యక్రమం కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైన మార్పు తీసుకొచ్చే కార్యక్రమం యోగా అని తెలిపారు.