Home » Womens Reservation Bill
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం బుధవారం సాయంత్రం జరగనుంది.
మహిళా రిజర్వేషన్ చట్టంతో ముడిపడిన సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ముందుకు వస్తోందని, రిజర్వేషన్ బిల్లు మహిళలకు సమర్పిస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో అతి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నామని, పార్లమెంటు కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉందని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన ఎక్స్ పోస్టుపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పందించారు. మహిళా రిజర్వేషన్లపైన సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ల చట్టంతో ముడిపడిన సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ పార్లమెంటు ప్రత్యేక సమావేశానికి కేంద్రం పిలుపునివ్వడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్పందించారు. ప్రత్యేక సమావేశానికి ప్రభుత్వం పిలుపునివ్వడం వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్ కాదని, నియోజకవర్గాల పునర్వభజన (డీలిమిటేషన్) కోసమేనని అన్నారు.
పార్లమెంట్లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశ పెట్టనున్నారని బీజేపీ మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా నలుగుతున్న మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, దీనిని ఒక చారిత్రాత్మక విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ భారీ కార్యాచరణను సిద్ధం చేసింది.
మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2024 జనాభా లెక్కల తర్వాత మహిళ రిజర్వేషన్ బిల్లు అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఆమోదం పొందిన ప్రతిష్ఠాత్మక 'మహిళా రిజర్వేషన్ బిల్లు'కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారంనాడు ఆమోదించారు. దీంతో ఈ బిల్లు చట్టరూపం సంతరించుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆదివారంనాడు తొలిసారి స్పందించారు. బిల్లును ముందుగానే అమలు చేసి రాహుల్ గాంధీ నియోజకవర్గాన్ని ఒక మహిళకు కేటాయిస్తే ఆయన ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు.