Home » Womens Reservation Bill
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్రెడ్డి(MP Mithun Reddy) వ్యాఖ్యానించారు.
ఉత్తర్ ప్రదేశ్(Uttarpradesh) మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధినేత్రి మాయావతి పార్లమెంటు(Parliament)లో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్సభలో మంగళవారంనాడు ప్రవేశపెట్టడంతో దీనిపై చర్చ కూడా మొదలైంది. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించని ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐంఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్(R. S. Praveen Kumar) వ్యాఖ్యానించారు.
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కల్పించే 'నారీ శక్తి వందన్ అభియాన్' బిల్లు ఎట్టకేలకు మంగళవారంనాడు లోక్సభకు ముందుకు వచ్చింది. దీంతో ఈ బిల్లు నేషనల్ డపవల్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ బ్లాక్ ఐక్యతకు తొలి పరీక్ష కానుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారంనాడు లోక్సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా పార్లమెంటు నూతన భవనంలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై సెప్టెంబర్ 20వ తేదీన చర్చ జరుగుతుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లు బుధవారం పార్లమెంటు ముందుకు రానుంది. బిల్లు ఆమోదం పొందే సమయానికి భారీగా వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చే అవకాశం ఉంది.
పార్లమెంట్(Parliament)లో మహిళ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC KAVITHA) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు ఆమె క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నామని కవిత తెలిపారు.