Home » West Bengal
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సుష్మితా దేవ్ తాజాగా రాజీనామా చేశారు. ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రాజ్యసభ రెండో ఎంపీగా సుష్మిత నిలిచారు.
సంతకాల ఫోర్జరీకి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్కు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసు విచారణలో భాగంగా ఖాళీఘాట్లోని టీఎంసీ కార్యాలయానికి సీఐడీ బృందం మంగళవారంనాడు వెళ్లింది. అయితే సీఐడీ టీమ్ను కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని తెలుస్తోంది.
పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న తృణమూల్ కాంగ్రెస్ కీలక నేత జహంగీర్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఈ ఉదయం ఆయన్ని నేపాల్ సరిహద్దుల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మదన్ మిత్రాకు చేదు అనుభవం ఎదురైంది. కమార్హాటీ నియోజకవర్గంలోని అరియాదయా ప్రాంతంలో కొంత గందరగోళ పరిస్థితులున్నాయనే సమాచారంతో ఆయన అక్కడకు వెళ్లారు. కొందరు స్థానికులు ఆగ్రహంతో కోడిగుడ్డు విసరడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక టీఎంసీ కార్యకర్త చీరల కింద దాక్కున్న ఘటన పశ్చిమబెంగాల్లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కోసం తాను ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సౌరవ్ గంగూలీ కోరినట్టు వచ్చిన వార్తలపై యూసఫ్ పఠాన్ స్పందించారు. తనను ఎవరూ అలా అభ్యర్థించలేదని స్పష్టం చేశారు.
యూసుఫ్ పఠాన్ తన ఎంపీ సీటుకు రాజీనామా చేసేలా ఒప్పించేందుకు మాజీ సీఎం మమత తరఫున తాను సంప్రదింపులు జరిపినట్టు వస్తున్న వార్తలను సౌరవ్ గంగూలీ స్పందించారు. ఈ కథనాల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.
భాంగర్ బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడైన తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సౌకత్ మొల్లాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.
మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్కు గడ్డుకాలం తప్పేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఒక ఎత్తయితే, పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, పలువురు ఎంపీల్లో ఇటీవల పెల్లుబుకుతున్న అసంతృప్తి ఆ పార్టీని గుక్కతిప్పుకోనీయడం లేదు.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న మేయర్ కృష్ణా చక్రవర్తి తన పదవికి రాజీనామా చేశారు.