Home » West Bengal
పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లా మధురాపూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బాపీ హల్దార్ పార్టీ కార్యాలయంపై స్థానికులు ఆదివారంనాడు దాడి చేశారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. వరద సహాయక సామగ్రిని అక్రమంగా పార్టీ కార్యాలయంలో దాచిపెట్టారని ఆరోపిస్తూ గ్రామస్థులు ఈ దాడి జరిపినట్టు పోలీసులు తెలిపారు.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, కల్యాణ్ బెనర్జీపై దాడులు ఇప్పటికే సంచలనం సృష్టించగా, తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఖోకన్ దాస్ను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో పోలీసులు అరెస్టు చేశారు.
కీలకమైన మంత్రివర్గ విస్తరణను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టనుంది. కొత్తగా 35 మందిని మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఆదివారంనాడు ప్రకటించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై సోనార్పూర్లో జరిగిన దాడి తీవ్ర సంచలనమవుతోంది. బీజేపీ నేతలే తనను చంపేందుకు కుట్రపూరితంగా దాడి చేశారని అభిషేక్ బెనర్జీ చేసిన ఆరోపణలను తాజాగా బీజేపీ ఖండించింది. టీఎంసీలో అంతర్గత విభేదాలే దాడికి కారణంగా కనిపిస్తోందని పేర్కొంది.
సోనార్పూర్లో తనపై జరిగిన దాడిని టీఎంసీ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఖండించారు. తనపై జరిగిన దాడిని రాజకీయ హింసగా అభివర్ణించారాయన.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. చందితల పోలీస్ స్టేషన్ బయట ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఐదుగురు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. శనివారం సోనాపూర్లో స్థానికులు అభిషేక్పై విచక్షణా రహితంగా దాడి చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పశ్చిమ బెంగాల్లోని సోనాపూర్లో స్థానికులు దాడి చేసిన సంగతి తెలిసిందే. మేనల్లుడిపై దాడి జరిగిన సంగతి తెలియగానే మమతా బెనర్జీ హుటాహుటిన ఆస్పత్రి దగ్గరకు వెళ్లారు. మేనల్లుడిని పరామర్శించారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై దాడి జరగడంపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'పాలకులు హంతకులుగా మారుతున్నారు. బీజేపీకి ఇది సిగ్గుచేటు' అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో మండిపడ్డారు.